ప్రముఖ అనువాదకుడు రంగనాథ రామచంద్రరావుకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం...
ప్రముఖ అనువాద రచయిత రంగనాథ రామచంద్రరావు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారానికి ఎంపికయ్యారు. రామచంద్రరావు తెలుగు అనువాదం 'ఓం ణమో' పుస్తకానికి ఈ అవార్డు వరించింది. ఈ నవలను కన్నడంలో శాంతినాథ దేసాయి రాశారు. కథకుడిగా,అనువాదకుడిగా సాహితీ రంగంలో రామచంద్రరావు విశేష కృషి చేస్తున్నారు.
రామచంద్రరావు పూర్వీకులది మైసూరు సమీపంలోని చామరాజనగర్.అయితే చాలా ఏళ్ల క్రితమే వారి కుటుంబం కర్నూలు వచ్చి స్థిరపడింది. తల్లిదండ్రుల నుంచి కన్నడ,కర్నూలులో పుట్టి పెరగడం వల్ల తెలుగు భాషలు వచ్చాయి. కన్నడ నుంచి అత్యుత్తమ సాహిత్యాన్ని తెలుగు పాఠకులకు అందజేసేందుకు ఆయన అనువాద రచనను ఎంచుకున్నట్లు గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.ఒకరకంగా తన అనువాదాలతో తెలుగు, కన్నడ సాహితీ రంగాలకు ఆయనొక వారధిగా ఉన్నారు.

దాదాపు 350 పైచిలుకు కథలను రామచంద్రరావు తెలుగు సహా వివిధ భాషల్లోకి అనువదించారు.ఇందులో 200కి పైగా కన్నడ కథలు ఉన్నాయి.మిగిలినవాటిల్లో హిందీ,ఇంగ్లీషు కథలు ఉన్నాయి.కన్నడ నుంచి తెలుగుకు అనువదించిన కథల్లో 'రాళ్లు కరిగే వేళ', 'తిరుగుబాటు', 'ఓం నమో', 'పూర్ణచంద్ర తేజస్వి జీవితమూ సాహిత్యమూ', 'అంతఃపురం', 'అవధేశ్వరి','ప్రసిద్ధ సమకాలీన కన్నడ కథలు', 'నలుపు, తెలుపు కొన్ని రంగులు' 'మూగడి బాధ','మా అమ్మంటే నాకిష్టం' తదితర కథలు ఉన్నాయి.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications