సారిక కేసు తీవ్రత దృష్ట్యా రాజయ్యకు, ఫ్యామిలీకి బెయిల్ ఇవ్వని కోర్టు
వరంగల్: సంచలనం సృష్టించిన మాజీ పార్లమెంటు సభ్యుడు సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక, ఆమె ముగ్గురు పిల్లల మృతి కేసులో నిందితులు రాజయ్య, ఆయన భార్య మాధవి, కొడుకు అనిల్ కుమార్లకు బెయిల్ ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది.
తాజాగా వీరు రెండోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. వీరు రెండోసారి దరఖాస్తు చేసుకున్న బెయిల్ పిటిషఖన్, ప్రధాన నిందితుడు అనిల్ కుమార్ తొలిసారి ఇచ్చిన పిటిషన్లను కేసు తీవ్రత దృష్ట్యా కోర్టు తిరస్కరించింది.

రాజయ్య దంపతులు, అనిల్ కుమార్లు వేర్వేరుగా బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. వీరి బెయిల్ పిటిషన్లను రెండో అదనపు జిల్లా న్యాయస్థానం గురువారం నాడు కొట్టివేసింది. రెవెన్యూ కాలనీలోని రాజయ్య ఇంట్లో తన కోడలు సారిక, ముగ్గురు పిల్లలు సజీవదహనమైన విషయం తెలిసిందే.

ఈ సంఘటన నవంబర్ 4వ తేదీన జరిగింది. ఇప్పటికే రాజయ్య, ఆయన భార్య మాధవిలు కోర్టులో పెట్టుకున్న బెయిల్ పిటిషన్ను నవంబర్ 18వ తేదీన కోర్టు కొట్టేసింది. తాజాగా, వారి బెయిల్, ప్రధాన నిందితుడు అనిల్ కుమార్ బెయిల్ను కూడా కొర్టు కొట్టేసింది.
-
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన












Click it and Unblock the Notifications