సారిక కేసు తీవ్రత దృష్ట్యా రాజయ్యకు, ఫ్యామిలీకి బెయిల్ ఇవ్వని కోర్టు
వరంగల్: సంచలనం సృష్టించిన మాజీ పార్లమెంటు సభ్యుడు సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక, ఆమె ముగ్గురు పిల్లల మృతి కేసులో నిందితులు రాజయ్య, ఆయన భార్య మాధవి, కొడుకు అనిల్ కుమార్లకు బెయిల్ ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది.
తాజాగా వీరు రెండోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. వీరు రెండోసారి దరఖాస్తు చేసుకున్న బెయిల్ పిటిషఖన్, ప్రధాన నిందితుడు అనిల్ కుమార్ తొలిసారి ఇచ్చిన పిటిషన్లను కేసు తీవ్రత దృష్ట్యా కోర్టు తిరస్కరించింది.

రాజయ్య దంపతులు, అనిల్ కుమార్లు వేర్వేరుగా బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. వీరి బెయిల్ పిటిషన్లను రెండో అదనపు జిల్లా న్యాయస్థానం గురువారం నాడు కొట్టివేసింది. రెవెన్యూ కాలనీలోని రాజయ్య ఇంట్లో తన కోడలు సారిక, ముగ్గురు పిల్లలు సజీవదహనమైన విషయం తెలిసిందే.

ఈ సంఘటన నవంబర్ 4వ తేదీన జరిగింది. ఇప్పటికే రాజయ్య, ఆయన భార్య మాధవిలు కోర్టులో పెట్టుకున్న బెయిల్ పిటిషన్ను నవంబర్ 18వ తేదీన కోర్టు కొట్టేసింది. తాజాగా, వారి బెయిల్, ప్రధాన నిందితుడు అనిల్ కుమార్ బెయిల్ను కూడా కొర్టు కొట్టేసింది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications