కారులో 30 లక్షల రద్దైన పెద్ద నోట్లు స్వాధీనం
వరంగల్ నుండి హైద్రాబాద్ కు కారులో 30 లక్షలను తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. హైద్రాబాద్ కు చెందిన కూల్ డ్రింక్ వ్యాపారి కనకయ్య ఈ నగదును హైద్రాబాద్ లో మార్చుకోవడం సాధ్యం కాకపోవడంతో వర
హన్మకొండ :హన్మకొండ నుండి హైద్రాబాద్ కు కారులో తరలిస్తున్న 30 లక్షల రూపాయాలను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.హన్మకొండ నుండి హైద్రాబాద్ కు కారులో రద్దు చేసిన ఐదువందల రూపాయాల నగదును కారులో తరలిస్తున్న సమాచారంతో తనిఖీలు చేసి పట్టుకొన్నారు.
హైద్రాబాద్ ఎల్ బి నగర్ కు చెందిన కూల్ డ్రిం క్ వ్యాపారి నీలం కనకయ్య కు చెందిన నోట్లుగా పోలీసులు గుర్తించారు. బ్యాంకుల ద్వారా ఈ నగదును మార్చుకొనేందుకు కనకయ్యకు వీలు పడలేదు. దీంతో ఆయన వరంగల్ కు చెందిన మరో కూల్ డ్రింక్ వ్యాపారి రవిని ఆశ్రయించాడు.

వరంగల్ కు చెందిన రవి కూడ ఈ డబ్బును మార్చేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. దీంతో ఈ డబ్బును తీసుకెళ్ళే క్రమంలో కనకయ్య పోలీసులకు పట్టుబడ్డాడు.
ఈ డబ్బును రెవిన్యూ శాఖ అధికారుల సమక్షంలో పంచనామా నిర్వహించారు. ఆధాయపు పన్ను శాఖ అధికారులకు అప్పగించి కేసును విచారిస్తున్నారు.అయితే ఈ నగదు కనకయ్యకు ఎలా వచ్చింది తదితర అంశాలపై ఆయన అధికారులు ఆరా తీస్తున్నారు.












Click it and Unblock the Notifications