కారులో 30 లక్షల రద్దైన పెద్ద నోట్లు స్వాధీనం
వరంగల్ నుండి హైద్రాబాద్ కు కారులో 30 లక్షలను తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. హైద్రాబాద్ కు చెందిన కూల్ డ్రింక్ వ్యాపారి కనకయ్య ఈ నగదును హైద్రాబాద్ లో మార్చుకోవడం సాధ్యం కాకపోవడంతో వర
హన్మకొండ :హన్మకొండ నుండి హైద్రాబాద్ కు కారులో తరలిస్తున్న 30 లక్షల రూపాయాలను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.హన్మకొండ నుండి హైద్రాబాద్ కు కారులో రద్దు చేసిన ఐదువందల రూపాయాల నగదును కారులో తరలిస్తున్న సమాచారంతో తనిఖీలు చేసి పట్టుకొన్నారు.
హైద్రాబాద్ ఎల్ బి నగర్ కు చెందిన కూల్ డ్రిం క్ వ్యాపారి నీలం కనకయ్య కు చెందిన నోట్లుగా పోలీసులు గుర్తించారు. బ్యాంకుల ద్వారా ఈ నగదును మార్చుకొనేందుకు కనకయ్యకు వీలు పడలేదు. దీంతో ఆయన వరంగల్ కు చెందిన మరో కూల్ డ్రింక్ వ్యాపారి రవిని ఆశ్రయించాడు.

వరంగల్ కు చెందిన రవి కూడ ఈ డబ్బును మార్చేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. దీంతో ఈ డబ్బును తీసుకెళ్ళే క్రమంలో కనకయ్య పోలీసులకు పట్టుబడ్డాడు.
ఈ డబ్బును రెవిన్యూ శాఖ అధికారుల సమక్షంలో పంచనామా నిర్వహించారు. ఆధాయపు పన్ను శాఖ అధికారులకు అప్పగించి కేసును విచారిస్తున్నారు.అయితే ఈ నగదు కనకయ్యకు ఎలా వచ్చింది తదితర అంశాలపై ఆయన అధికారులు ఆరా తీస్తున్నారు.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications