హైదరాబాద్కు విఘాతం: కెసిఆర్పై శంకర్రావు
హైదరాబాద్: నగరంలోని ట్యాంక్బండ్పై ఉన్న సీమాంధ్ర ప్రముఖల విగ్రహాలు అవసరం లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అనటం సరికాదని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత శంకర్రావు అభిప్రాయపడ్డారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఉన్న విగ్రహాలను తొలగించకుండానే తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు ఏర్పాటు చేయాలని అన్నారు.
సీమాంధ్రకు చెందిన ప్రముఖుల విగ్రహాలను తొలగిస్తే హైదరాబాద్కు విఘాతం జరుగుతుందని శంకర్రావు వ్యాఖ్యానించారు. తెలుగువారి మధ్య ఐక్యత లేకపోతే అభివృద్ధి కుంటుపడుతుందని అన్నారు. తెలుగువారి మధ్య విద్వేషాలు మంచిది కాదని శంకర్రావు హితవు పలికారు.

కెసిఆర్ మూల్యం చెల్లించుకోక తప్పదు: చాడ
కరీంనగర్: తెలంగాణలో విద్యుత్ సమస్య తీవ్రంగా ఉండటంతో రైతులు నష్టపోతున్నారని, ఇందుకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు మూల్యం చెల్లించుకోక తప్పదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మండిపడ్డారు. నగరాల్లో కూడా నాలుగు నుంచి ఆరు గంటలపాటు కోతలు విధిస్తున్నారని అన్నారు.
సాధారణంగా ఇళ్లలో జరుపుకోవాల్సిన పండగలను అధికారికంగా నిర్వహిస్తూ కెసిఆర్ ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారని చాడ వెంకటరెడ్డి విమర్శించారు. బిజెపి, కాంగ్రెస్ కూటములు కుంభకోణాల్లో కూరుకుపోయాయని ఆరోపించిన ఆయన, దీనిపై అక్టోబర్ 16న దేశవ్యాప్త ఆందోళనలు చేపడతామని తెలిపారు.
-
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications