వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైదరాబాద్‌కు విఘాతం: కెసిఆర్‌పై శంకర్రావు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగరంలోని ట్యాంక్‌బండ్‌పై ఉన్న సీమాంధ్ర ప్రముఖల విగ్రహాలు అవసరం లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అనటం సరికాదని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత శంకర్రావు అభిప్రాయపడ్డారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఉన్న విగ్రహాలను తొలగించకుండానే తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు ఏర్పాటు చేయాలని అన్నారు.

సీమాంధ్రకు చెందిన ప్రముఖుల విగ్రహాలను తొలగిస్తే హైదరాబాద్‌కు విఘాతం జరుగుతుందని శంకర్రావు వ్యాఖ్యానించారు. తెలుగువారి మధ్య ఐక్యత లేకపోతే అభివృద్ధి కుంటుపడుతుందని అన్నారు. తెలుగువారి మధ్య విద్వేషాలు మంచిది కాదని శంకర్రావు హితవు పలికారు.

Shanka Rao fires at KCR

కెసిఆర్ మూల్యం చెల్లించుకోక తప్పదు: చాడ

కరీంనగర్: తెలంగాణలో విద్యుత్ సమస్య తీవ్రంగా ఉండటంతో రైతులు నష్టపోతున్నారని, ఇందుకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు మూల్యం చెల్లించుకోక తప్పదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మండిపడ్డారు. నగరాల్లో కూడా నాలుగు నుంచి ఆరు గంటలపాటు కోతలు విధిస్తున్నారని అన్నారు.

సాధారణంగా ఇళ్లలో జరుపుకోవాల్సిన పండగలను అధికారికంగా నిర్వహిస్తూ కెసిఆర్ ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారని చాడ వెంకటరెడ్డి విమర్శించారు. బిజెపి, కాంగ్రెస్ కూటములు కుంభకోణాల్లో కూరుకుపోయాయని ఆరోపించిన ఆయన, దీనిపై అక్టోబర్ 16న దేశవ్యాప్త ఆందోళనలు చేపడతామని తెలిపారు.

English summary
Congress senior leader Shanka Rao on Monday fired at Telangana CM K Chandrasekhar Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X