జానీ మాస్టర్ కు బిగ్ షాక్.. యాంకర్ ఝాన్సీ సెన్సేషనల్ పోస్ట్ వైరల్!
మహిళా కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే. ఆపైన బెయిల్ పైన జానీ మాస్టర్ విడుదల కావడం, తర్వాత జరుగుతున్న పరిణామాలు తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఇక ఈ నేపథ్యంలో తాజాగా జానీ మాస్టర్ కు మరో ఎదురు దెబ్బ తగిలింది. జానీ మాస్టర్ మీద తీసుకున్న నిర్ణయం పైన ఆయన వేసిన పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది.
జానీ మాస్టర్ కు షాక్..యాంకర్ ఝాన్సీ పోస్ట్
ఈ విషయాన్ని యాంకర్, ఫిలిం ఇండస్ట్రీ అసోసియేషన్ కమిటీ సభ్యురాలు ఝాన్సీ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఫిల్మ్ చాంబర్ తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ వేసిన మధ్యంతర పిటిషన్ ను జిల్లా కోర్టు కొట్టి వేసిందని యాంకర్ ఝాన్సీ తన పోస్టులో పేర్కొన్నారు.

జానీ మాస్టర్ పిటీషన్ పై కోర్టు కీలక తీర్పు ఇచ్చింది: యాంకర్ ఝాన్సీ
మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా కోర్టు ఇచ్చిన తీర్పు కీలకమైన తీర్పు అని ఝాన్సీ వెల్లడించారు. కోర్టు మరోసారి మహిళల భద్రతకు ప్రాధాన్యతను ఇస్తుందని స్పష్టతనిచ్చిందని ఆమె తెలిపారు. పనిచేసే ప్రదేశాల్లో మహిళలకు భద్రత ప్రధానమని POSH మార్గదర్శకాలను అమలు చేసే సంస్థలకు ఎప్పుడు మద్దతు ఉంటుందనేది ఈ తీర్పుతో రుజువైందని యాంకర్ ఝాన్సీ వెల్లడించారు..
శ్రేష్టి వర్మ ఫిర్యాదుపై ఫిలిం ఛాంబర్ నిర్ణయం
తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి ఈ అంశంలో ధర్మం కోసం నిలబడి పోరాటం చేసిందని వారికి ప్రత్యేక ధన్యవాదాలు అంటూ ఝాన్సీ తన పోస్టులో తెలిపారు.ఇదిలా ఉంటే జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన శ్రేష్ఠి వర్మ ఫిలిం ఛాంబర్ లోని లైంగిక వేధింపుల పరిష్కార కమిటీ లోను జానీ మాస్టర్ లైంగిక వేధింపుల పైన ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన కమిటీ అసోసియేషన్ అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని ఫిలిం ఛాంబర్ ని కోరింది.
జానీ మాస్టర్ పిటీషన్ కొట్టేసిన ధర్మాసనం
అయితే ఈ కేసులో తన నేరం రుజువు కాకుండా తనను ఎలా తప్పిస్తారని జానీ మాస్టర్ కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం జానీ మాస్టర్ పిటిషన్ ను తాజాగా కొట్టివేసింది ఇక ఇదే విషయాన్ని యాంకర్ ఝాన్సీ సోషల్ మీడియాలో పోస్ట్ ద్వారా అందరికీ తెలిసేలా చేశారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications