భగవద్గీత శ్లోకంతో స్మితా సబర్వాల్ సంచలన ట్వీట్!
తెలంగాణ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్న స్మిత సబర్వాల్ ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల బదిలీ చేసిన విషయం తెలిసిందే. స్మిత సబర్వాల్ ను రాష్ట్ర ఆర్థిక సంఘం సభ్య కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది . ఇక స్మిత సబర్వాల్ స్థానంలో సీనియర్ ఐఏఎస్ అధికారి జయేష్ రంజన్ కు పర్యాటక శాఖ బాధ్యతలను అప్పగించింది.
భగవద్గీత శ్లోకంతో స్మితా సబర్వాల్ పోస్ట్
తాజాగా స్మిత సబర్వాల్ తన బదిలీ నేపథ్యంలో ఎక్స్ వేదికగా స్పందించారు. పర్యాటక శాఖలో తన పని చేసిన విధానాన్ని, నాలుగు నెలల కాలంలో తాను చేసిన కృషిని వెల్లడించారు. అయితే ఈ సందర్భంగా ఆమె భగవద్గీతలోని ఒక శ్లోకాన్ని ఉటంకిస్తూ తన పోస్టును ప్రారంభించారు.

పర్యాటక శాఖలో పని చేసిన తీరును చెప్పిన స్మితా సబర్వాల్
కర్మణ్యే వాధికారస్తే మాఫలేషు కదాచన అంటూ తన పోస్టును ప్రారంభించిన స్మిత సబర్వాల్ పర్యాటక శాఖలో నాలుగు నెలల కాలం పని చేసి, తన వంతుగా అత్యుత్తమ సేవలు అందించడానికి కృషి చేశానన్నారు. రాష్ట్రానికి మొట్టమొదటిసారిగా దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న 2025- 30 పర్యాటక విధానాన్ని తీసుకువచ్చామని, ఈ విధానం వల్ల రాష్ట్రంలో నిర్లక్ష్యం చేయబడిన పర్యాటక ప్రాంతాలకు దిశానిర్దేశం చేయడం జరిగిందన్నారు.
మిస్ వరల్డ్ పోటీల గురించి స్మితా సబర్వాల్
పెట్టుబడులను ఆకర్షించడానికి బలమైన పునాదిగా ఈ పర్యాటక విధానం నిలుస్తుందని స్మిత సబర్వాల్ వెల్లడించారు. ఇక తాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్ణయం తీసుకొని నిర్వహించడానికి తలపెట్టిన మిస్ వరల్డ్ పోటీల గురించి ప్రస్తావించారు. హైదరాబాద్లో జరిగే మిస్ వరల్డ్ పోటీలు ఒక గ్లోబల్ ఈవెంట్ అని, దీనికి అవసరమైన ప్రణాళిక, మౌలిక సదుపాయాల ఏర్పాటుకు పునాది వేశానని ఆమె పేర్కొన్నారు.
స్మితా సబర్వాల్ ను కొనియాడుతున్న నెటిజన్లు
ఇది తెలంగాణ రాష్ట్రంలో అనేక అవకాశాలకు తలుపులు తీస్తుందని తాను విశ్వసిస్తున్నాను అని స్మిత సబర్వాల్ తెలిపారు. పర్యాటక శాఖలో పని చేయడం గర్వంగాను, గౌరవం గాను భావిస్తున్నానని స్మిత సబర్వాల్ వెల్లడించారు. అయితే స్మిత సబర్వాల్ పోస్ట్ చూసిన నెటిజన్లు ఆమె చేసిన కృషిని కొనియాడుతున్నారు.
కంచె గచ్చిబౌలి భూముల విషయంలో పోస్ట్ తో ఆమెపై బదిలీ వేటు
నువ్వు కర్మ చేయడానికి మాత్రమేగానీ, ఆ కర్మఫలానికి అధికారివి కాదు. ప్రతిఫలాపేక్షతో కర్మలను చేయకు. అలాగని కర్మలు చేయడం మానకు అంటూ భగవద్గీత శ్లోకాన్ని తన పోస్టులో పేర్కొన్న స్మిత సబర్వాల్ తను చేసే పనికి ప్రతిఫలాపేక్ష తో కాకుండా పనిచేయడమే తన విధి అని పేర్కొన్నారు. ఇటీవల హైదరాబాద్ శివార్లలో కంచె గచ్చిబౌలి భూములు కేటాయింపు వ్యవహారంలో ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో స్మిత సబర్వాల్ పోస్ట్ పెట్టడంతో ఆమెపై బదిలీ వేటు పడింది అని ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది.
-
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం












Click it and Unblock the Notifications