విషాదం: అమెరికాలో జరిగిన కాల్పుల్లో తెలంగాణ టెక్కీ సాయిచరణ్ మృతి
నల్గొండ: అమెరికాలో గన్ కల్చర్తో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా, మేరీలాండ్ నగరంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్.. ఓ దుండగుడి కాల్పుల్లో మరణించాడు. మరణించిన టెక్కీని నల్గొండకు చెందిన నక్క సాయి చరణ్(26)గా గుర్తించారు.
యువకుడిపై ఆదివారం కాల్పులు జరపగా.. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సాయి మృతితో నల్గొండలో విషాదఛాయలు అలుముకున్నాయి.
సాయి నల్గొండకు చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు నర్సింహ కుమారుడు.

సాయిచరణ్ అమెరికాలోని బాల్టిమోర్లో ఉంటూ గత రెండేళ్లుగా సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నారు. కాగా, ఆదివారం ఉదయం తన మిత్రుడిని కారులో విమానాశ్రయంలో వదిలి తిరిగి ఇంటికి వెళ్తుండగా.. అతనిపై ఓ నల్లజాతీయుడు కాల్పులు జరిపాడు. దీంతో సాయి చరణ్ అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానిక అధికారులు అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
కాల్పుల ఘటన తర్వాత సాయిని యూనివర్శిటీ ఆఫ్ మేరీల్యాండ్ ఆర్. ఆడమ్స్ కౌలీ షాక్ ట్రామా సెంటర్కు తరలించారు. అక్కడ అతను కొద్దిసేపటి తర్వాత మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. అతని తలపై తుపాకీ గాయం ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications