హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దంపతుల ముసుగులో గెస్ట్ హౌస్‌లో 5 జంటల వ్యభిచారం, అరెస్ట్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఎస్ఓటీ పోలీసులు సోమవారం నాడు ఓ అతిథి గృహం పైన దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో దంపతుల ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ఐదు జంటలను అదుపులోకి తీసుకున్నారు. ఎస్ఓటీ పోలీసులు కీసర ప్రభుత్వ అతిథి గృహంపై దాడి నిర్వహించారు.

వేధింపులు తాళలేక విద్యార్థిని ఆత్మహత్య

ప్రేమ పేరుతో యువకుడి వేధింపులు తాళలేక విద్యార్థిని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన నల్గొండ జిల్లా పెన్‌పహడ్ మండలం లింగాలలో చోటు చేసుకుంది. విద్యార్థిని పదో తరగతి చదువుతోంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

SOT police raid on Guest house

చైన్ స్నాచర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు

చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతున్న ఓ దొంగను బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు దొంగ వద్ద నుంచి పన్నెండు తులాల బంగారంతోపాటు పలు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

అన్నదాత ఆత్మహత్య

నల్గొండ జిల్లాలో అప్పుల బాధ భరించలేక పత్తి రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. మేళ్ల చెరువు మండలం ఎల్లటూరు గ్రామంలో సోమవారం నాడు కిష్టయ్య అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పు పెరగడంతో వాటిని తీర్చే దారి కనిపించక పురుగుల మందు తాగాడు.

English summary
SOT police raid on Guest house in Keesara on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X