రైల్వే శాఖ గుడ్ న్యూస్, హైదరాబాద్ లో మూడు మెగా రైల్వే టెర్మినళ్లు - ఈ ప్రాంతాల్లో ఖరారు..!!

రైల్వే శాఖ కీలక అప్డేట్. హైదరాబాద్ వాసులకు రైల్వే తీపి కబురు అందిస్తోంది. హైదరాబాద్ పరిధిలో రైల్వే పైన పెరుగుతున్న ఒత్తిడి వేళ కీలక నిర్ణయం తీసుకుంది. నగర పరిధిలో కొత్తగా మూడు రైల్వే టెర్మినళ్ల ఏర్పాట కు దక్షిణ మధ్య రైల్వే ప్రతిపాదనలు పంపింది. దీని పైన రైల్వే బోర్డు సానుకూలంగా నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఈ మూడు టెర్మినళ్ల ఏర్పాటు ప్రాంతాలు.. భూ సమీకరణ.. నిధుల అంచనాల పైనా కసరత్తు పూర్తయింది. బెంగళూరు తరహాలో ఈ మూడు టెర్మినళ్లు ఏర్పాటు చేయనున్నారు. దీంతో, పూర్తిగా హైదరాబాద్ లో రైల్వే నిర్వహణ స్వరూపమే మారిపోనుంది.

హైదరాబాద్ కు వచ్చే రైళ్ల సంఖ్య పెరుగుతోంది. వివిధ రాష్ట్రాల నుంచి హైదరాబాద్ కు కనెక్టివిటీ పెరిగింది. నిత్యం లక్షల సంఖ్యలో ప్రయాణీకులు రాక పోకలు సాగిస్తున్నారు. దీంతో.. ప్రస్తుతం ఉన్న సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి పైన ఒత్తిడి పెరుగుతోంది. చర్లపల్లి అందుబాటులోకి వచ్చిన తరువాత కొంత మేర ప్రయోజనం ఉన్నా.. ఇంకా టెర్మినల్స్ అవసరమని దక్షిణ మధ్య రైల్వే గుర్తించింది. అందులో భాగంగా హైదరాబాద్ పరిధిలో మరో మూడు మెగా టెర్మినల్స్ కోసం రైల్వే బోర్డుకు ప్రతిపాదనలు సమర్పించింది. ఇందు కోసం మూడు ప్రాంతాలను ఎంపిక చేసింది. ఓఆర్​ఆర్​, ఆర్​ఆర్​ఆర్ ​(ట్రిపులార్‌) మధ్యలో నిర్మించేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రణాళికలు సిద్ధం చేసింది. వరంగల్‌ మార్గంలో ఇప్పటికే చర్లపల్లి టెర్మినల్‌ను నిర్మించి అందుబాటులోకి తీసుకువచ్చింది. వికారాబాద్‌-ముంబయి మార్గంలో రామచంద్రాపురం మండలంలోని నాగులపల్లి టెర్మినల్‌ కట్టాలనే డిమాండ్‌ పైన ఫోకస్ చేసింది.

 కేసీఆర్ రాజీనామా అస్త్రం..!? సంచలన వ్యూహం- టార్గెట్ రేవంత్..!!
కేసీఆర్ రాజీనామా అస్త్రం..!? సంచలన వ్యూహం- టార్గెట్ రేవంత్..!!
south-central-railway-proposes-four-mega-terminals-around-hyderabad-to-ease-station-congestion

రైల్వే శాఖ నిర్ణయంతో... ప్రయాణీకుల కష్టాలకు చెక్

దీంతోపాటు మహబూబ్‌నగర్‌-బెంగళూరు మార్గంలో జూకల్‌-శంషాబాద్‌, నిజామాబాద్‌-నాందేడ్‌ మార్గంలో డబిల్‌పుర్‌-మేడ్చల్‌ టెర్మినళ్లపై రైల్వే శాఖ దృష్టి పెట్టింది. ఈ విస్తరణ కోసం 250 ఎకరాల భూమిని కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఇతర దిశల్లో ప్రతిపాదించిన మూడు మెగా టెర్మినళ్ల కోసం కూడా భూమి అవసరమని తెలిపింది. మొత్తంగా 1,125 ఎకరాల వివాదరహిత భూమిని ఇవ్వాలని స్పష్టం చేసింది. ఈ టెర్మినళ్ల అధ్యయనానికి రూ.13.96 కోట్లు ఖర్చు చేసింది. మూడు కొత్త టెర్మినళ్ల నిర్మాణం, చర్లపల్లి విస్తరణ కోసం కలిపి మొత్తం 1,125 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. అటు రైల్వే బోర్డు నుంచి ఈ ప్రతిపాదనల పైన సానుకూలత వచ్చినట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే డీపీఆర్ మేరకు వచ్చే జనవరిలో వీటికి భూమి పూజ చేసే అవకాశం ఉందని సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+