కాలేజీలో వైష్ణవ్ ఎలా ఉండేవాడంటే!: దత్తాత్రేయ కుమారుడి మృతిపై శ్రీచైతన్య ప్రిన్సిపాల్
Recommended Video

హైదరాబాద్: గుండెపోటుతో హఠాన్మరణం చెందిన మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ కుమారుడు వైష్ణవ్ గురించి నారాయణగూడ శ్రీచైతన్య కళాశాల ప్రిన్సిపాల్ సరస్వతి ఆసక్తికర విషయాలు తెలిపారు.
వైష్ణవ్ మృతి తమను దిగ్భ్రాంతికి గురిచేసిందని చెప్పిన ఆమె.. అతని కలుపుగోలుతనం గురించి, సేవా గుణం గురించి మరోసారి గుర్తుచేసుకున్నారు. కాలేజీలో ఎన్నడూ అతనో ఎంపీ కుమారుడిలా ప్రవర్తించలేదని, ఆ ప్రస్తావనే రాకుండా చూసుకునేవాడని అన్నారు.

కాగా, నారా యణగూడలోని శ్రీ చైతన్య కళాశాలలో 2012 నుంచి 2014 వరకు వైష్ణవ్ ఇంటర్ చదివాడు. ఆ తర్వాత ఎంబీబీఎస్ లో చేరాడు.
వైష్ణవ్ గురించి మరిన్ని విషయాలు చెబుతూ.. కాలేజీలో ఎవరికి ఏ ఆపద వచ్చిన అతను స్పందించేవాడని ప్రిన్సిపాల్ సరస్వతి చెప్పారు. తన తండ్రితో మాట్లాడి తగిన సహాయం అందేలా ప్రయత్నించేవాడన్నారు.
గతంలో ఓ అధ్యాపకుడి కూతురు అనారోగ్యంతో అమెరికాలో చనిపోయిన సందర్భంలో.. ఆమె మృతదేహాన్ని త్వరితగతిన ఇక్కడికి తీసుకొచ్చేందుకు వైష్ణవ్ ఎంతో కృషిచేశాడని చెప్పారు. మరో సందర్భంలో.. నేపాల్ లో ఎంబీబీఎస్ చదవడానికి వెళ్లి భూకంపం వచ్చిన సమయంలో అక్కడే చిక్కుకుపోయిన మరో విద్యార్థినిని కూడా సురక్షితంగా రప్పించడానికి వైష్ణవ్ తనవంతు సహాయం చేశాడన్నారు.
విద్యార్థులకే కాకుండా, కాలేజీలో అధ్యాపకులు, అటెండర్లు ఎవరికి ఏ సమస్య వచ్చినా వైష్ణవ్ స్పందించేవాడని అన్నారు. 15రోజుల క్రితమే బంధువుల అమ్మాయి అడ్మిషన్ కోసం తమను సంప్రదించినట్టు సరస్వతి తెలిపారు.
-
డబుల్ బెడ్ రూం ఇళ్లపై ప్రభుత్వం కీలక ప్రకటన- వీరికే, పంపిణీ ముహూర్తం ఫిక్స్...!! -
ఈ జిల్లాలకు వర్ష సూచన చేసిన ద్రోణి.. రైతన్నలూ అలెర్ట్! -
హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణపై భారీ శుభవార్త! -
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications