తరిమికొడ్తాం: ఆంధ్ర స్టాఫ్కు శ్రీనివాస్ గౌడ్ హెచ్చరిక
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఏపీఎన్జీఓ హోంలో బతుకమ్మను ఆడుకోనివ్వకుండా అడ్డుపడిన ఘటనలు పునరావృతమైతే సీమాంధ్ర ఉద్యోగులను పొలిమేర దాకా తరిమికొడతామని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు వి.శ్రీనివాస్గౌడ్ హెచ్చరించారు. శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.
ఏపీఎన్జీఓ హోంలో కొందరు మహిళలు బతుకమ్మ ఆడుకోవటానికి ప్రయత్నిస్తే, ఆ కార్యాలయ ద్వారానికి తాళం వేసి, పోలీసు బలగాలను మోహరించటాన్ని తప్పుపట్టారు. ‘‘మా కళ్ల ముందు.. మా గడ్డపై బతుకమ్మను ఆడనివ్వకపోవటం ఏ సంస్కృతికి నిదర్శనం'' అని ప్రశ్నించారు. బతుకమ్మ ఆడటానికి ప్రయత్నించిన మహిళలతో సీమాంధ్ర ఉద్యోగులు అసభ్యంగా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు రెచ్చగొట్టినా భయపడాల్సిన అవసరం లేదని, వాళ్ల సంగతి చూసుకుంటామని హెచ్చరించారు.

తమ ప్రభుత్వంలోనూ ఆంధ్రా పోలీసులున్నారని, ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల్లో సీమాంధ్ర వారూ ఎక్కువగా ఉన్నారని, వాళ్లు ఇక్కడి నుంచి ఎలాగూ వెళ్లిపోతారని, పోయే ముందు హైదరాబాద్లో అల్లర్లు సృష్టించాలని ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. అసత్య ప్రచారాలతో అల్లకల్లోలం చేయాలని చూస్తున్నారని, వాళ్లపైనా తాము పడుతామని చెప్పారు.
తెలంగాణ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య పిచ్చి పట్టిన వాడిలా మాట్లాడుతున్నారని అంటూ పొన్నాల నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని శ్రీనివాస గౌడ్ హితవు పలికారు. తెలుగుదేశం ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య తన స్థాయికి తగని మాటలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే, జాతీయ పార్టీ అని చెబుతున్న టీడీపీకి ఆర్.కృష్ణయ్యను అధ్యక్షుడిని చేయాలని డిమాండ్ చేశారు.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications