మన పని అయిపోయింది: వెలుగులోకి శ్రీశైలం ప్రమాద ఘటనలో ఏఈల సంభాషణ
హైదరాబాద్: శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో సంభవించిన భారీ అగ్ని ప్రమాదంలో 9 మంది సిబ్బంది మృతి చెందిన విషయం తెలిసిందే. తాజా ఈ ప్రమాదానికి సంబంధించిన ఓ ఆడియో వెలుగులోకి వచ్చింది. ప్రమాద సమయంలో ఈ ఘటనలో మృతి చెందిన ఏఈలు సుందర్, మోహన్ల సంభాషణ వెలుగుచూసింది.
Recommended Video

ప్రమాద దృశ్యాలు.. కన్నీటిపర్యంతమైన మోహన్ సతీమణి..
ప్రమాద ఘటనలో చనిపోయే ముందు మోహన్.. అగ్ని ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలను వీడియో తీశాడు. శనివారం మోహన్ ఫోన్కు ఛార్జింగ్ పెట్టిన అతడి భార్య అందులోని ప్రమాద వీడియో దృశ్యాలు, సంభాషణను చూసి కన్నీటిపర్యంతమయ్యారు.

చనిపోయే కొన్ని క్షణాల ముందు ఏఈల సంభాషణ..
సుందర్: ఇక కష్టం.. మన పని అయిపోయింది.. ఆశలు వదులుకో
మోహన్: లేదు.. ఆశగా ఉండాలె.. కొద్ది సేపు ఆలోచించుకుని పోదాం.
సుందర్: ఆలోచించే సమయం లేదు.. ఇక మనం బతకం.. పొగ మొత్తం అలుముకుంది. కాగా, సుందర్, మోహన్ ప్రమాదం నుంచి బయటపడేందుకు ప్రయత్నించారు కానీ, ఫలితం లేకపోయింది.

పిల్లలు జాగ్రత్త అంటూ ఏఈ సుందర్..
కాగా, అంతకుముందు సుందర్ తన భార్యతో జరిపిన ఫోన్ సంభాషణ కూడా వెలుగులోకి వచ్చింది. ‘నువ్వు, పిల్లలు జాగ్రత్త. 15 నిమిషాల్లో కాపాడలేకపోతే బతికే పరిస్థితి లేదు' అని సుందర్ చివరిసారిగా తన కుటుంబసభ్యులతో మాట్లాడారు.
ప్రమాదం జరిగిన సమయంలో విధుల్లో 17 మంది సిబ్బం ఉండగా.. 8 మంది ప్రాణాలతో బయటపడ్డారు. 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై సీఐడీ విచారణ జరుగుతోంది.

ప్రమాద ఘటనపై విచారణ కొత్త కమిటీ
శ్రీశైల విద్యుత్ కేంద్రం ప్రమాద ఘటన బాధాకరమని ట్రాన్స్కో, జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తం సిబ్బందిని కాపాడే ప్రయత్నం చేశామని, కానీ, విషాదమేమిగిలిందన్నారు. పవర్ జనరేషన్ ఎక్కువ ఉందని
ఆపేశామని, వస్తున్న ఆరోపణలు అవాస్తవమని తెలిపారు. మృతుల కుటుంబాలకు సాయం చేస్తామని, ప్రమాదంపై ఇంటర్నల్ కమిటీ వేశామని ప్రభాకర్ రావు వెల్లడించారు. తాజాగా, శ్రీశైలం ప్రమాద ఘటనపై టీఎస్ ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమా రెడ్డి అధ్యక్షతన నలుగురు సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటు చేశారు. సీఐడీతో సంబంధం లేకుండా వీరు ప్రత్యేక దర్యాప్తు చేయనున్నారు. 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ట్రాన్స్కో, జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు ఆదేశించారు.
ఈ కమిటీలో సభ్యులుగా..
శ్రీనివాసరావు-జేఎండీ
జగత్ రెడ్డి-ట్రాన్సిమిషన్ డైరెక్టర్
సచ్చిదానందం-ప్రాజెక్టు డైరెక్టర్, టీఎస్ జెన్కో
రత్నాకర్-కన్వీనర్.
-
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
మహేశ్కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో అల్లు అర్జున్ కుమార్తె..! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా!












Click it and Unblock the Notifications