మగ మృగం: భర్త వదిలేస్తే పెళ్లి చేసుకున్నాడు, ఆమె కూతురిని రేప్ చేశాడు
ఆ మగ మృగం వావివరుసలు మరిచింది. భార్య కూతురిపై కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది.
హైదరాబాద్: కామాంధులకు వావివరుసలు కూడా పట్టడం లేదు. కామంతో కళ్లు మూసుకుపోయి ఓ వ్యక్తి తన భార్య కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో జరిగింది. బాధితురాలు అతని రెండో భార్య కూతురు.
తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ మహిళ భర్తను వదిలేసింది. ఆమెకు పదకొండేళ్ల కూతురు, కుమారుడు ఉన్నారు. కర్నూలు జిల్లాకు చెందిన ఓ వ్యక్తి భార్యను విడిచిపెట్టి సంగారెడ్డి జిల్లాలో ఉంటున్నాడు. వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడడంతో ఐదేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు.
నవంబర్ 30వ తేదీన ఆమె కూలికెళ్లడాన్ని అవకాశంగా తీసుకుని కూతురును పాఠశాల నుంచి నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి అఘాయిత్యం చేశాడు. విషయం అమ్మకు చెప్తే చంపుతానని బెదిరించాడు. కుమార్తెతోపాటు తల్లి గురువారం గుూరువారం పాఠశాలకు వెళ్లింది. నిందితుడు బాలికను స్కూల్ నుంచి తీసుకెళ్లిన విషయం తెలిసింది.
దాంతో కూతుర్ని తల్లి ఎందుకు తీసుకుని వెళ్లాడని అడిగింది. తల్లి ప్రశ్నించడంతో జరిగిన విషయాన్ని బాధితురాలు చెప్పింది. ఆ రోజు రాత్రి భర్తను నిలదీసింది. ఐడీఏబొల్లారం పోలీస్ట్షన్లో శుక్రవారం ఫిర్యాదు చేసింది. నిందితుడిని అదుపులోకి తీసుకొని నిర్భయకేసు నమోదు చేశామని సీఐ సతీష్రెడ్డి చెప్పారు.