'కొందరు నీచులు నేర్పుతారా, బీజేపీని ఓడించాలనుకోవడం కుట్ర ఎలా అవుతుంది'
హైదరాబాద్: కొందరు నీచులు కమ్యూనిస్టులకు దేశభక్తి పాఠాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి మంగళవారం మండిపడ్డారు. ముగ్ధుం భవన్లో పార్టీ 92వ ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
కమ్యూనిస్టులది విదేశీ సిద్ధాంతమని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. హిట్లర్ది, ఆరెస్సెస్ది ఒకటే గుర్తు అని, వాళ్లు దేశ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనని నీచులు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలాంటి వాళ్లు తమకు దేశభక్తి నేర్పే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

బీజేపీని ఓడించాలనుకోవడం కుట్ర ఎలా అవుతుంది
సీపీఐలో చీలికల వల్లే కమ్యూనిస్టులు బలహీనులయ్యారని సురవరం అన్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలనుకోవడం కుట్ర ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ దేశభక్తిపై తమకు ఎలాంటి అనుమానం లేదన్నారు.

మోడీ అనుచిత వ్యాఖ్యలు
గుజరాత్ ఎన్నికల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ మాజీ ప్రధాని మన్మోహన్ పైన అనుచిత వ్యాఖ్యలు చేశారని, వాటిని తాము ఖండిస్తున్నామని చెప్పారు. శాతవాహన యూనివర్సిటీలో వామపక్ష విద్యార్థి సంఘాలపై ఆరెస్సెస్, ఏబీవీపీ కార్యకర్తలు దాడి చేశారని ఆరోపించారు.

ఆకట్టుకున్న కళా ప్రదర్శనలు
కాగా, మంగళవారం సీపీఐ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కళా ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. హిమాయత్నగర్లోని సత్యనారాయణ రెడ్డి భవనం నుంచి మఖ్ధూం భవన్ వరకు ప్రదర్శన నిర్వహించారు.

ఉర్రూతలూగించిన ప్రజా నాట్య మండలి
దారిలో సాంస్కృతిక ప్రదర్శనలు అటుగా వెళ్తున్న వారికి ఆసక్తిని కలిగించాయి. మహిళలు కోలాటం ఆడుతూ, ప్రజానాట్యమండలి విభాగం పాటలు పాడుతూ అందరినీ ఉర్రూతలూగించారు.
-
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!!












Click it and Unblock the Notifications