ఎవరీ విశాల్: తమిళనాడులో తెలుగోడి సత్తా
హైదరాబాద్: ఆర్కె నగర్ ఉప ఎన్నికల బరిలో నిలిచిన సినీ నటుడు విశాల్ తెలుగు వాడే, విశాల్ బాల్యం హైద్రాబాద్లో గడిచింది. విశాల్ కుటుంబం కొంత కాలం హైద్రాబాద్లో నివసించింది. అయితే కొన్ని కారణాల రీత్యా విశాల్ కుటుంబం తమ నివాసాన్ని చెన్నైకు మార్చారు. ప్రస్తుతం విశాల్ తమిళ రాజకీయాలతో పాటు హట్ టాపిక్గా మారారు.
తమిళనాడు రాష్ట్రంలో ఆర్కె నగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.ఈ ఉప ఎన్నికల్లో సినీ నటుడు విశాల్ కూడ బరిలోకి దిగుతున్నాడు. జయలలిత సమాధి వద్ద నివాళులర్పించిన తర్వాత విశాల్ నామినేషన్ పత్రాలను సమర్పించేందుకు వెళ్ళాడు.
ఆర్కె నగర్ ఉప ఎన్నికల్లో విశాల్ పోటీ చేయాలని నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారంది. అయితే విశాల్ పోటీ చేయాలనే నిర్ణయం తమిళ రాజకీయాల్లో హట్ టాపిక్ గా మారింది.
చదవండి: జయ సమాధి వద్ద విశాల్, వెనుక ఎవరు: క్యూలో ఇండిపెండెంట్లు షాక్

విశాల్ తెలుగువాడే
తమిళహీరో విశాల్ తెలుగువాడే. విశాల్ కుటుంబం కొంత కాలం హైద్రాబాద్లో నివసించింది. విశాల్ పూర్తి పేరు విశాల్ కృష్ణారెడ్డి, విశాల్ అని ముద్దుగా పిలుస్తారు. జికె రెడ్డి,జానకి దేవి దంపతుల కొడుకు విశాల్. 1977 ఆగష్టు 29న విశాల్ పుట్టాడు. విశాల్ సోదరుడు విక్రమ్ కృష్ణ సినిమా రంగంతో సంబంధాలున్నాయి. విశాల్కు ఇద్దరు చెల్లెల్లున్నారు.

హైద్రాబాద్లో విశాల్ విద్యాభ్యాసం
విశాల్ కుటుంబం హైద్రాబాద్లో నివసించే సమయంలో విశాల్ బాల్యంలో హైదరాబాదులోని దిల్షుర్నగర్ పబ్లిక్ స్కూల్లో చదివాడని చెబుతారు. ఆ తర్వాత విశాల్ కుటుంబం హైద్రాబాద్ నుండి చెన్నైకు మకాం మార్చారు. దీంతో విశాల్ చదువంతా చెన్నైలోనే సాగింది.విశాల్ సెకండరీ ఎడ్యుకేషన్ను చెన్నైలోని డాన్ బోస్కో మెట్రిక్యులేన్ హయ్యర్ సెకండరీ స్కూల్లో పూర్తి చేశాడు. ఆ తర్వాత లయోలా కాలేజీ నుంచి విజ్యువల్ మీడియాలో డిగ్రీ చేశారు.

విశాల్ తండ్రి పలు సినిమాలకు నిర్మాత
చెన్నైలో స్థిరపడిన జికె రెడ్డి తమిళ, తెలుగు సినిమాలను నిర్మించారు. అన్న విక్రమ్ కృష్ణ విశాల్ నటించిన పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. సినిమాలకు నిర్మాతగా వ్యవహరించే జికె రెడ్డి ఈ కారణంగానే తన నివాసాన్ని హైద్రాబాద్ నుండి చెన్నైకు మార్చారని చెబుతారు. జెకె రెడ్డి తర్వాత ఆయన కొడుకు విక్రమ్ కృష్ణ కూడ సిని రంగంలోనే కొనసాగాడు. అదే బాటలో విశాల్ కూడ పయనించాడు.

శరత్కుమార్ను ఓడించిన విశాల్ ప్యానెల్
దక్షిణ భారత సినీ నటుల సంఘం ఎన్నికల్లో శరత్ కుమార్ ప్యానెల్ను విశాల్ ప్యానెల్ ఓడించి సంచలనం సృష్టించింది.ఈ ఎన్నికల సమయంలో సినీ నటి రాధిక విశాల్ తెలుగు వాడని ప్రచారం కూడ చేసింది. అయినా ఆ ఎన్నికల్లో విశాల్ ప్యానెల్ భారీ విజయాన్ని సాధించింది. అయితే శరత్కుమార్కు వ్యతిరేక వర్గమంతా విశాల్ వెంట నడిచారు. దీంతో ఈ ఎన్నికల్లో విశాల్ ప్యానెల్ విజయం సాధించింది.

ఆర్కె నగర్ ఉప ఎన్నికల్లో
ఆర్కె నగర్ ఉప ఎన్నికల్లో అనుహ్యంగా విశాల్ బరిలోకి దిగాడు. అయితే ఈ నిర్ణయం తమిళనాడు రాజకీయాల్లో హట్ టాపిక్గా మారింది. అయితే విశాల్ ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకోవడం వెనుక బలమైన కారణమే ఉంటుందనే ప్రచారం సాగుతోంది. అంతేకాదు భవిష్యత్తులో విశాల్ రాజకీయ పార్టీని ఏర్పాటు చేయాలనే ఆలోచన కూడ చేస్తున్నారనే ప్రచారం కూడ సాగుతోంది.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications