సిఎం కెసిఆర్ కలలను నిజం చేయాలి, సహకరించాలి: తనికెళ్ల భరణి
మహబూబ్నగర్: అందరూ సమిష్టిగా కృషిచేసి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు కలలుగంటున్న బంగారు తెలంగాణకు సహకరించాలని ప్రముఖ సినీ నటుడు, రచయిత తనికెళ్ల భరణి సూచించారు. శనివారం మహబూబ్నగర్ జిల్లా దేవరక్రద ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి నివాసంలో శనివారం మీడియాతో మాట్లాడారు.
పాలమూరు జిల్లాలోని వనరులను సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందడానికి జిల్లావాసులంతా సమిష్టిగా కృషిచేయాల్సిన అవసరం ఉందన్నారు. 2011లో అడ్డాకుల మండలంలో కందూరు రామలింగేశ్వర ఆలయాన్ని సందర్శించి కొత్త అనుభూతికి గురయ్యానని చెప్పారు.

ఆలయ చరిత్రను రాయించడం లేదంటే స్వయంగా రచిస్తానన్నారు. దేశంలో ఎనిమిది జ్యోతిర్లింగాలకన్నా కందూరు రామలింగేశ్వరుని స్వామి ఆలయమే మహా శక్తి వంతమైందన్నారు. స్వామి వారి ఆలయం కోనేరు చుట్టూ 27 కల్ప (కదంబ) వృక్షాలు ఉండడం వల్ల సాక్షాత్తు పార్వతీ, సరస్వతీ మాతల శక్తి పీఠమన్నారు.
అంతేగాక, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి, జేపీఎన్సీఈ చైర్మన్ రవికుమార్ సహకారాలతో ఆలయాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానన్నారు భరణి. ఈ సందర్భంగా ఆలయాన్ని సందర్శించి జేపీఎన్సీ కళాశాల విద్యార్థులతో కలిసి స్వచ్ఛ భారత్లో పాల్గొన్నారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications