టీచర్లకు చేదువార్త: వారికి ఇక ప్రమోషన్లు లేనట్లే!
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయుల(Teachers) పదోన్నతులు ప్రస్తుతానికి ఆగిపోయినట్లేనని తెలుస్తోంది. పదోన్నతి పొందాలన్నా ఉపాధ్యాయ అర్హత పరీక్ష(TET) తప్పనిసరి అని కొందరు టీచర్లు హైకోర్టును ఆశ్రయించడం, టెట్ ఉత్తీర్ణులై.. పదోన్నతి పొందేందుకు అర్హులైన వారి సీనియారిటీ జాబితా సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించిన నేపథ్యంలో స్కూల్ అసిస్టెంట్లుగా, గెజిటెడ్ హెచ్ఎంలుగా పదోన్నతులకు బ్రేక్ పడినట్లేనని నిపుణులు పేర్కొంటున్నారు.
ఈ పరిస్థితుల్లో పదోన్నతులపై ముందుకెళ్లడం సాధ్యం కాదని విద్యాశాఖ అధికార వర్గాలు కూడా చెబుతున్నాయి. కాగా, ఉపాధ్యాయులుగా నియమితులు కావడంతో పాటు, పదోన్నతులకూ టెట్ ఉత్తీర్ణతను తప్పనిసరిచేస్తూ కేంద్రం 2010లో చట్టం చేసింది. ఆ ప్రకారం జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి ఆ ఏడాదే నిబంధనలు విడుదల చేసింది. అయితే, తాజా పదోన్నతుల్లో ఆ నిబంధనలను పాటించాలంటూ కొందరు ఉపాధ్యాయులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ క్రమంలోటెట్ పాసై ప్రస్తుతం ఉపాధ్యాయులుగా ఉన్నవారి సీనియారిటీ జాబితాను సమర్పించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై కౌంటర్ దాఖలు చేస్తామని ప్రభుత్వం న్యాయస్థానానికి నివేదించింది. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులకు పదోన్నతులు కష్టమని విద్యాశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.
కాగా, ఇప్పటికే మల్టీ జోన్-1తో పాటు మల్టీ జోన్-2 పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే 1,218 మంది స్కూల్ అసిస్టెంట్లకు జీహెచ్ఎంలుగా పదోన్నతి దక్కింది. ప్రస్తుతం స్కూల్ అసిస్టెంట్లకు బదిలీల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ప్రక్రియ యథావిధిగా కొనసాగుతోంది. అనంతరం అక్టోబరు 2 తర్వాత ఎస్జీటీలకు, స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది. తాజాగా, చోటు
చోటు చేసుకున్న పరిణామాలతో ఈ ప్రక్రియ జరగక పోవచ్చని విద్యాశాఖ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
ఈ పదోన్నతుల ప్రక్రియ ప్రారంభం కావడానికి మరో 5 రోజులు సమయం ఉన్నందున ఆలోపు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న విషయమై ఉత్కంఠ నెలకొంది. కాగా, అక్టోబరు 2 నుంచి యథావిధిగా ప్రక్రియ ప్రారంభమై.. టెట్ లేకుండా పదోన్నతులు ఇస్తే 2,162 మంది సెకండరీ గ్రేడ్ టీచర్లు ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, మరో 5,870 మంది స్కూల్ అసిస్టెంట్లు అయ్యేవారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications