తెలంగాణలో బెంబేలెత్తిస్తోన్న కరోనా: వరుసగా రెండో రోజూ: కోలుకోవట్లేదు: లోయెస్ట్ డిశ్చార్జీలు
హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. వరుసగా రెండో రోజు కూడా మూడువేలకు చేరువగా కరోనా పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. బుధవారం నాటి బులెటిన్తో పోల్చుకుంటే.. రోజువారీ కేసుల సంఖ్యలో స్వల్పంగా తగ్గుదల కనిపించింది. 3018 కేసులు నమోదు కాగా.. ఈ సారి ఈ సంఖ్య మూడువేలలోపే నమోదైంది. గ్రేటర్ హైదరాబాద్ సహా ఇతర జిల్లాల్లో కరోనా కరాళ పరిస్థితుల్లో ఎలాంటి మార్పూ ఉండట్లేదు. రంగారెడ్డి జిల్లాలో 250కి పైగా కేసులు నమోదు అయ్యాయి.
తెలంగాణలో కరోనా కేసుల కొత్త వెల్లువ: ఒక్కరోజే మూడువేలకు పైగా: పీక్స్లో టెస్టులు
కొత్తగా 2795 కేసులు..
కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, మంచిర్యాల, మేడ్చల్ మల్కాజ్గిరి, సిద్ధిపేట్, నిజామాబాద్, నల్లగొండ, వరంగల్ అర్బన్ జిల్లాల్లో అదే తీవ్రత కనిపిస్తోంది. తెలంగాణలో 24 గంటల వ్యవధిలో 2795 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఎనిమిది మంది మరణించారు. 872 మంది పేషెంట్లు డిశ్చార్జి అయ్యారు. సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకున్నారు. దీనితో ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,14,483కు చేరుకుంది. ఇందులో 86,095 మంది డిశ్చార్జి అయ్యారు. కరోనా వల్ల మరణించిన వారి సంఖ్య 788కి చేరుకుంది.
భారీగా తగ్గిన డిశ్చార్జీలు..
మొత్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 27,600గా నమోదైంది. గృహాలు, ఇన్స్టిట్యూషనల్ ఐసొలేషన్లో 20,866 మంది చికిత్స పొందుతున్నారు. 24 గంటల్లో అతి తక్కువ డిశ్చార్జిలు నమోదు అయ్యాయి. 872 మంది మాత్రమే కోలుకున్నారు. చాలాకాలం తరువాత లోయెస్ట్ డిశ్చార్జీలు నమోదు అయ్యాయి. దీని ఫలితం యాక్టివ్ కేసులపై పడుతోంది. యాక్టివ్ కేసుల సంఖ్య క్రమంగా 30 వేలకు చేరుకుంటోంది. ఇప్పటిదాకా 27,600 యాక్టివ్ కేసులు తెలంగాణలో నమోదు అయ్యాయి.
గ్రేటర్ సహా అనేక జిల్లాల్లో..
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు మళ్లీ మొదటికి వచ్చాయి. 24 గంటల్లో కొత్తగా 449 పాజిటివ్ కేసులు రికార్డు అయ్యాయి. జీహెచ్ఎంసీకి ఆనుకుని ఉన్న రంగారెడ్డిలో రికార్డు స్థాయిలో కొత్త కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. కొత్తగా సిద్ధిపేట్, మహబూబాబాద్ జిల్లాల్లో వందకు పైగా కేసులు రికార్డు అయ్యాయి. కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లో వైరస్ తీవ్రత కొనసాగుతోంది.
జిల్లాలవారీగా లెక్కలివే..
24 గంటల్లో కొత్తగా ఆదిలాబాద్-31, భద్రాద్రి కొత్తగూడెం-72, జగిత్యాల-89, జనగామ-42, జయశంకర్ భూపాలపల్లి-26, జోగుళాంబ గద్వాల-31, కామారెడ్డి-55, కరీంనగర్-136, ఖమ్మం-152, కొమరంభీమ్ ఆసిఫాబాద్-17, మహబూబ్ నగర్-45, మహబూబాబాద్-102, మంచిర్యాల-106, మెదక్-41, మేడ్చల్ మల్కాజ్గిరి-113, ములుగు-26, నాగర్ కర్నూలు-40, నల్లగొండ-164, నారాయణపేట్-24, నిర్మల్-25, నిజామాబాద్-112, పెద్దపల్లి-77, రాజన్న సిరిసిల్ల-32, రంగారెడ్డి-268, సంగారెడ్డి-34, సిద్ధిపేట్-113, సూర్యాపేట్-86, వికారాబాాద్-27, వనపర్తి-55, వరంగల్ రూరల్-34, వరంగల్ అర్బన్-132, యాదాద్రి భువనగిరి-39 కేసులు నమోదు అయ్యాయి.
Recommended Video
టెస్టుల్లోనూ తెలంగాణ సర్కార్ దూకుడు..
ప్రాణాంతక కరోనా వైరస్ పరీక్షలను నిర్వహించడంలో తెలంగాణ ప్రభుత్వం తన దూకుడును కొనసాగిస్తోంది. కొత్తగా వ్యాప్తంగా 60,386 శాంపిళ్లను పరీక్షించినట్లు తాజా బులెటిన్లో వెల్లడించారు. 50 వేలకు మించి కరోనా టెస్టులను నిర్వహించడం వరుసగా ఇది మూడోసారి. ఇప్పటిదాకా పరీక్షించిన శాంపిళ్ల సంఖ్య 11,42,480కి చేరుకుంది. ఆర్టీ-పీసీఆర్/సీబీనాట్/ట్రూనాట్, ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టింగ్ కేంద్రాల ద్వారా పరీక్షలను నిర్వహిస్తున్నారు. ప్రతి 10 లక్షలమంది జనాభాకు సగటున 30,772 పరీక్షలను నిర్వహించిన్నట్లు అధికారులు తెలిపారు.