వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంచీపురం అత్తివరద స్వామీని దర్శించుకోనున్న సీఎం కేసిఆర్

|
Google Oneindia TeluguNews

నేడు తెలంగాణ సీఎం కేసిఆర్ తమిళనాడులోని కాంచీపురం వెళ్లనున్నారు. తాను కుటుభ సభ్యులతో కలిసి నలబై సంవత్సరాలకోసారి దర్శణమిచ్చే అత్తి వరదరాజస్వామీని దర్శించుకున్నారు. కాగా ఆయన ఉదయమే కాంచీపురం బయలు దేరివెళ్లనున్నట్టు అధికారులు తెలిపారు. జూన్ 1నుండి ప్రజలకు అత్తివరదస్వామి దర్శనమిస్తున్నారు. కాగా ఈనెల 17 వరకు స్వామి వారు దర్శనమివ్వ నేపథ్యంలోనే సీఎం కేసీర్ స్వామీ దర్శనానికి వెళుతున్నారు. కాగా ఆలయం కోనేటి గర్భంలో ఉండే అత్తి వరదరాజస్వామి 40 సంవత్సరాలకొకసారి 48 రోజుల పాటు భక్తులకు దర్శనమిస్తారు. కాగా అంతకుముందు 1979లో భక్తులకు దర్శనమించారు.

Telangana CM KCR is going to Kanchipuram in TamilaNadu on monday.

దక్షిణాపథంలో ఉన్న ఏకైక మోక్షపురి కంచిలో ఉన్న ప్రసిద్ది చెందిన ఆలయాల్లో శ్రీ వరదరాజ స్వామి దేవాలయం ఒకటి. 108 దివ్వతిరుపతులలో ఒకటై ప్రధానమైన వైష్ణవ దివ్వక్షేత్రాలలో ఒకటిగా విరాజిల్లుతోంది. తమిళుల ఆరాధ్యదైవంగా... కోరిన కోర్కెలు తీర్చే దేవుడిగా కాంచీపురంలో అత్తివరదస్వామి కొలువై ఉన్నాడు.

తొమ్మిది అడుగుల పొడవైన స్వామివారి విగ్రహం ఈ సమయంలో మొదటి 38 రోజులు శయన భంగిమలోనూ, చివరి 10 రోజులు నిలబడి ఉన్నట్టుగా దర్శనమిస్తుంది. ఉదయం, సాయంత్రం రెండు పూటలు స్వామికి సహస్రనామార్చన జరుగుతుంది. ఉదయం 6 గం నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు దర్శించుకోవచ్చు. దీంతో నలబై సంవత్సరాలు ఒకసారి దర్శనమిచ్చే అత్తివరద స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటుత్తుతారు. దీంతో నలబై రోజుల పాటు కాంచీపురం వీధులు భక్తులతో కిటకిటలాడతాయి.

English summary
Telangana CM KCR is going to Kanchipuram in Tamil Nadu today. He had visited the Atti Varadarajaswamy with his family.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X