కేసీఆర్ కాన్వాయ్లో ఖరీదైన కార్లు: ఫార్చ్యూనర్ల స్ధానంలో ల్యాండ్ క్రూయిజర్లు (ఫోటోలు)
హైదరాబాద్: దేశంలో అత్యంత ఖరీదైన వాహనాల కాన్యాయ్ కలిగి ఉన్న సీఎంల జాబితాలోకి తెలంగాణ సీఎం కేసీఆర్ చేరిపోయారు. ఇప్పటి వరకూ టయోటా కంపెనీకి చెందిన ఫార్చ్యూనర్లనే వాడుతూ వస్తున్న కేసీఆర్ వాటి స్ధానంలో అత్యంత ఖరీదైన ల్యాండ్ క్రూయిజర్లను తన కాన్వాయ్లో సమకూర్చుకున్నారు.
ఒక్కొక్కటీ రూ.1.30 కోట్ల విలువైన 5 ల్యాండ్ క్రూయిజర్ ప్రాడోలను కాన్వాయ్లో చేరాయి. ఈ వాహనాలను బుల్లెట్ ప్రూఫ్ కూడా చేయించారని తెలుస్తోంది. ల్యాండ్ క్రూయిజర్లు కూడా తెలుపు రంగులోనే కేసీఆర్ కాన్వాయ్లోకి ప్రవేశపెట్టారు.
ఈ వాహనాలకు యాదగిరిగుట్టలో పూజలు చేసిన అనంతరం బుధవారం నుంచి సీఎం కాన్వాయ్లో వినియోగిస్తున్నారు. ఇప్పటి వరకు సీఎం కేసీఆర్ టయోటా కంపెనీకి చెందిన ఫార్చ్యూనర్లను వాడారు. తొలిదశలో ఇవి నలుపురంగులో ఉండగా, వాటిని తెలుపు రంగులోకి మార్చారు.
ఇటీవలే రూ.5 కోట్ల విలువైన మెర్సిడెజ్ బెంజ్ బస్సును సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటనల కోసం కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. కాగా, ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేష్, రాజస్థాన్ సీఎం వసుంధర రాజేలు మెర్సిడెస్ బెంజ్లు వినియోగిస్తుండగా ఏపీ సీఎం చంద్రబాబు, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ టాటా సఫారీలు వాడుతున్నారు.

కేసీఆర్ కాన్వాయ్లో ఖరీదైన కార్లు
దేశంలో అత్యంత ఖరీదైన వాహనాల కాన్యాయ్ కలిగి ఉన్న సీఎంల జాబితాలోకి తెలంగాణ సీఎం కేసీఆర్ చేరిపోయారు.

కేసీఆర్ కాన్వాయ్లో ఖరీదైన కార్లు
ఇప్పటి వరకూ టయోటా కంపెనీకి చెందిన ఫార్చ్యూనర్లనే వాడుతూ వస్తున్న కేసీఆర్ వాటి స్ధానంలో అత్యంత ఖరీదైన ల్యాండ్ క్రూయిజర్లను తన కాన్వాయ్లో సమకూర్చుకున్నారు.

కేసీఆర్ కాన్వాయ్లో ఖరీదైన కార్లు
ఒక్కొక్కటీ రూ.1.30 కోట్ల విలువైన 5 ల్యాండ్ క్రూయిజర్ ప్రాడోలను కాన్వాయ్లో చేరాయి. ఈ వాహనాలను బుల్లెట్ ప్రూఫ్ కూడా చేయించారని తెలుస్తోంది.

కేసీఆర్ కాన్వాయ్లో ఖరీదైన కార్లు
ల్యాండ్ క్రూయిజర్లు కూడా తెలుపు రంగులోనే కేసీఆర్ కాన్వాయ్లోకి ప్రవేశపెట్టారు. ఈ వాహనాలకు యాదగిరిగుట్టలో పూజలు చేసిన అనంతరం బుధవారం నుంచి సీఎం కాన్వాయ్లో వినియోగిస్తున్నారు.
కేసీఆర్ కాన్వాయ్లో ఖరీదైన కార్లు
ఇప్పటి వరకు సీఎం కేసీఆర్ టయోటా కంపెనీకి చెందిన ఫార్చ్యూనర్లను వాడారు. తొలిదశలో ఇవి నలుపురంగులో ఉండగా, వాటిని తెలుపు రంగులోకి మార్చారు.

కేసీఆర్ కాన్వాయ్లో ఖరీదైన కార్లు
ఇటీవలే రూ.5 కోట్ల విలువైన మెర్సిడెజ్ బెంజ్ బస్సును సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటనల కోసం కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.

కేసీఆర్ కాన్వాయ్లో ఖరీదైన కార్లు
కాగా, ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేష్, రాజస్థాన్ సీఎం వసుంధర రాజేలు మెర్సిడెస్ బెంజ్లు వినియోగిస్తుండగా ఏపీ సీఎం చంద్రబాబు, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ టాటా సఫారీలు వాడుతున్నారు.












Click it and Unblock the Notifications