Degree చదవాలంటే ఎంట్రన్స్ టెస్ట్ రాయాల్సిందే! పెను మార్పులు
తెలంగాణలో డిగ్రీ విద్యను మరింత క్రమబద్ధీకరించే దిశగా ఉన్నత విద్యామండలి కీలక అడుగులు వేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని డిగ్రీ కళాశాలలను ఒకే గొడుగు కిందికి తీసుకురావడమే లక్ష్యంగా ప్రవేశ పరీక్షా విధానాన్ని ప్రవేశపెట్టాలని భావిస్తోంది. జాతీయ విద్యా విధానం (NEP) సిఫార్సుల మేరకు ప్రవేశ పరీక్ష ద్వారానే అడ్మిషన్లు జరపాలని అధికారులు సమాలోచనలు చేస్తున్నారు.
రాష్ట్రంలో 826 కళాశాలలు 'దోస్త్' (DOST) పోర్టల్ ద్వారా ప్రవేశాలు కల్పిస్తుండగా, మరో 70 ప్రైవేట్ కళాశాలలు మాత్రం నిబంధనలకు విరుద్ధంగా సొంతంగా అడ్మిషన్లు జరుపుకుంటున్నాయి. వీటిలో కొన్ని కళాశాలలు విద్యార్థుల నుంచి భారీగా ఫీజులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. గత ఎనిమిదేళ్లుగా సాగుతున్న ఈ 'నాన్-దోస్త్' తంతుకు చెక్ పెట్టాలంటే ప్రవేశ పరీక్ష ఒక్కటే మార్గమని విద్యామండలి చైర్మన్ ఆచార్య బాలకిష్టారెడ్డి, కళాశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన అభిప్రాయపడ్డారు.

2027-28 విద్యా సంవత్సరం నుంచి అమలు?
ప్రస్తుత విద్యా సంవత్సరానికి (2026-27) సమయం తక్కువగా ఉండటంతో, యధావిధిగా 'దోస్త్' ద్వారానే ప్రవేశాలు జరగనున్నాయి. అయితే, వచ్చే ఏడాది నాటికి పూర్తిస్థాయి విధివిధానాలను రూపొందించి, 2027-28 విద్యా సంవత్సరం నుంచి ప్రవేశ పరీక్షను తప్పనిసరి చేసే అవకాశం ఉంది. దీనివల్ల ప్రైవేట్ కళాశాలల అడ్డగోలు ప్రవేశాలకు బ్రేక్ పడుతుందని భావిస్తున్నారు.
డిమాండ్ లేని కోర్సులకు స్వస్తి!
ప్రస్తుతం దోస్త్ పరిధిలో ఉన్న 3.77 లక్షల సీట్లలో కేవలం 1.75 లక్షల సీట్లు మాత్రమే భర్తీ అవుతున్నాయి. దాదాపు 60 శాతం సీట్లు ఖాళీగా ఉంటుండటంతో పాటు, 70 కళాశాలల్లో ఒక్క విద్యార్థి కూడా చేరడం లేదని గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో, 'జీరో అడ్మిషన్లు' ఉన్న కోర్సులను మరియు కళాశాలలను రద్దు చేసేందుకు కూడా విద్యాశాఖ సిద్ధమవుతోంది.
ఈ నూతన విధానం అమల్లోకి వస్తే, రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలలన్నీ ఒకే తాటిపైకి రావడమే కాకుండా, విద్యార్థులకు పారదర్శకమైన ప్రవేశాలు లభించే అవకాశం ఉంది.
-
లక్షలు ఖర్చయ్యే క్యాన్సర్ రేడియేషన్ థెరపీ ఇప్పుడు నిమ్స్ లో ఉచితం.. శుభవార్త! -
Lockdown: ఇవాళ రాత్రి నుంచే కర్ఫ్యూ, ప్రభుత్వం సంచలన నిర్ణయం! -
ఒక్క పోస్టుతో అందరికీ ఇచ్చిపడేసిన "త్రిష".. -
నైరుతి రుతుపవనాలు షాక్. ఈ 4 నెలలు వర్షాలు కరువే? -
సమ్మర్ స్పెషల్ 'బాదంపాలు'.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి..! -
ఆ గోర్లేంటీ.. ఆ చెయ్యేంటీ: అల్లు అర్జున్- అట్లీ బాక్సాఫీస్ కింగ్ కాంగ్: ఈ దెబ్బకు -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' మూవీ ఫస్ట్ రివ్యూ: హిట్టు కొట్టి కొట్టి బోర్ కొట్టట్లేదా అన్నా..!! -
బంగారం ధరల్లో బిగ్ డౌన్ ఫాల్.. !! -
తమిళనాడులో రిచ్ అభ్యర్థి ఈమెనే! ఎవరీ లీమా రోజ్ మార్టిన్? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం, ద్రోణి- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
Assembly Poll Survey: బెంగాల్, అస్సాంలో గెలుపెవరిది ? షైనింగ్ ఇండియా తాజా సర్వే..! -
ఇరాన్ డెడ్ లైన్ పై ట్రంప్ మళ్లీ వెనక్కి ? అదే టర్నింగ్ పాయింట్..! -
జగన్ సెగ ఎక్కడ తాకాలో అక్కడ తాకింది.. -
వేసవి సెలవులలో పిల్లలు ఆ పనిచేసే అవకాశం.. తల్లిదండ్రులు అలెర్ట్! -
Tamil Nadu Poll Survey: తమిళనాడులో షాకింగ్ ఫలితాలు-లోక్ పోల్ తుది సర్వేలో వారే క్లీన్ స్వీప్..!














Click it and Unblock the Notifications