Telangana elections: సామాన్యుడిలా మెట్రోలో జనాల మధ్య నిలబడే ప్రయాణించిన కేటీఆర్.. ఏం చేశారంటే!!
తెలంగాణా మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈసారి ఎన్నికల్లో విజయం సాధించాలని ఆ దిశగా వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నారు. ప్రజల మద్దతు కూడగట్టటం కోసం ఆయన శత విధాలా ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో అన్ని వర్గాల వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు.
తాజాగా మంత్రి కేటీఆర్ హైదరాబాద్ మెట్రో రైల్ లో ప్రయాణించారు. రాయదుర్గం స్టేషన్ నుంచి బేగం పేట వరకు మెట్రో ప్రయాణించిన కేటీఆర్ రైలులో ప్రయాణిస్తున్న వారితో మాట్లాడారు. మెట్రో రైలులో ప్రయాణికులతో సామాన్యుడిలా మాట్లాడిన కేటీఆర్ నిల్చునే మెట్రోలో ప్రయాణం చేశారు. విపరీతమైన రద్దీలో కేటీఆర్ మెట్రోలో ప్రయాణం చెయ్యటం ఇప్పుడు రాజకీయవర్గాలలోనూ, సామాన్య ప్రజలలోనూ ఆసక్తిని రేకెత్తిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మంత్రి కేటీఆర్ రొటీన్ ప్రచారానికి భిన్నంగా ఈ తరహాలో సామాన్యుల వద్దకు, వివిధ వర్గాల వద్దకు నేరుగా వెళ్లి ముచ్చటిస్తున్నారు.తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు జరిగిన తర్వాత సాధించిన ప్రగతిని వారికి వివరిస్తున్నారు. ఒకపక్క రోడ్ షోలు, సమావేశాలతో హోరెత్తిస్తున్న కేటీఆర్ మరోపక్క యువతతో ముచ్చటించటం, మెట్రోలో ప్రయాణించి ప్రజలతో నేరుగా మాట్లాడటం వంటి చర్యలతో అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నారు.
హైదరాబాద్ మెట్రో రైల్ లో ప్రయాణించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్..!!
— oneindiatelugu (@oneindiatelugu) November 24, 2023
#KTR #HyderabadMetroRails #HMRL #BRS #TSAssemblyElections2023 #TSElections2023 #TelanganaAssemblyElections2023 #TelanganaElection2023 #TelanganaElections2023 #Oneindiatelugu pic.twitter.com/D76a0oswUh
ఇక మంత్రి కేటీఆర్ మెట్రో లో ప్రయాణం చెయ్యటంతో ప్రయాణం చేస్తున్న వారు కేటీఆర్ తో మాట్లాడటానికి ఉత్సాహం చూపారు. కొందరు కేటీఆర్ తో సెల్ఫీలు తీసుకోగా, మరికొందరు వీడియోలు తీసుకున్నారు. మొత్తంగా కేటీఆర్ తమతో పాటు మెట్రోలో ప్రయాణం చెయ్యటంతో మెట్రో లో సందడి నెలకొంది.
ఇదిలా ఉంటే BRS ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు, కార్యక్రమాల సమాహారంగా రూపొందించిన "ప్రగతి ప్రస్థానం ...ఎట్లుండే తెలంగాణ ఎట్లైంది " అన్న పుస్తకాన్ని BRS వర్కింగ్ ప్రెసిడెంట్, తారక రామారావు ఈ రోజు ఆవిష్కరించారు.
ప్రజల సంక్షేమమే లక్ష్యంగా అమలుచేసిన పథకాలు, కార్యక్రమాలు, విధానాల ఫలితాలు రాష్ట్రంలోని గడప గడపకూ చేరాయని ఈ సందర్భంగా అన్నారు. ఫలితంగానే రాష్ట్రంలో పేదరికం గణనీయంగా తగ్గినట్టు నీతి ఆయోగ్ నివేదిక స్పష్టం చేసిందని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం పునరంకితమవుతామని ఆయన పేర్కొన్నారు.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications