తెలంగాణా ఎన్నికలు: రంగంలోకి నందమూరి వారి ఆడపడుచు; అక్కడ టీడీపీ వ్యూహం!!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో తెలుగుదేశం పార్టీ ఉంటుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ప్రకటించిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ 87 స్థానాల్లో పోటీకి రెడీ అయిందని, ఈ ఎన్నికలను టిడిపి ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుందని, జనసేనతో పొత్తు విషయం పైన ఆలోచిస్తుందని కాసాని జ్ఞానేశ్వర్ ప్రకటించారు.
ఒకపక్క చంద్రబాబు జైల్లో ఉండి తెలుగుదేశం పార్టీ సంక్షోభంలో ఉన్న టైంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో టిడిపి ఎన్నికల బరిలో ఉంటుందని సంచలన ప్రకటన చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్లో తెలుగుదేశం పార్టీకి అభిమానులు ఉన్న నేపథ్యంలో కొన్ని సీట్లు అయినా టిడిపి తన ఖాతాలో వేసుకుంటుంది అని తెలుగుదేశం పార్టీ భావిస్తుంది.

క్షేత్రస్థాయిలో టిడిపికి ప్రజలలో బలం ఉందని, తమ ఓటు బ్యాంకు నుండి నష్టపోకుండా ఉండడం కోసం ఎన్నికల బరిలోకి దిగుతున్నట్టు ప్రస్తుత పరిస్థితులను బట్టి తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో కొన్ని స్థానాలైన గట్టిగా సాధించాలని పట్టుదలతో ఉన్న టిడిపి నందమూరి కుటుంబానికి చెందిన ఆడపడుచును రంగంలోకి దించనుంది.
2018 ఎన్నికలలో తొలిసారి నందమూరి కుటుంబం నుంచి నందమూరి సుహాసిని ఎన్నికల బరిలోకి దిగారు. కూకట్పల్లి నియోజకవర్గం నుంచి సుహాసిని పోటీ చేశారు. అప్పట్లో కాంగ్రెస్ తో పొత్తుల లో భాగంగా పోటీ చేసిన నేపథ్యంలో ఆమె గెలుస్తుంది అని అంతా భావించారు. నందమూరి బాలకృష్ణ వంటి వారి ప్రచారం చేయడం కూడా కలిసి వస్తుందని నమ్మారు. ఊహించని విధంగా సుహాసిని ఓటమిపాలయ్యారు.
ప్రస్తుతం మరోమారు ఆమె తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి టిడిపి నుంచి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. అయితే ఈసారి నందమూరి సుహాసిని ఎల్బీనగర్ నియోజకవర్గం, కూకట్పల్లి నియోజకవర్గం నుండి.. రెండు చోట్ల నుండి పోటీ చేస్తారని తెలుస్తుంది. ఈసారి సుహాసినిని గెలిపించుకోవడం అత్యంత ప్రతిష్టాత్మకంగా తెలుగుదేశం పార్టీ భావిస్తుంది.
సెటిలర్లు ఎక్కువగా ఉండే ఎల్బీనగర్ తో పాటు కూకట్పల్లి సీటును సుహాసినికి కేటాయించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరి సుహాసిని ఈసారైనా ఓటర్ల మనసు గెలుచుకుంటారా లేదా అనేది తెలియాల్సి ఉంది.
-
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం












Click it and Unblock the Notifications