All the Best:సెయిలింగ్ వరల్డ్ ఛాంపియన్షిప్కు భారత్ నుంచి హైదరబాద్ అమ్మాయి వైష్ణవి
హైదరాబాదు: ఒమన్లో డిసెంబర్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్న సీనియర్ వరల్డ్ సెయిలింగ్ ఛాంపియన్షిప్లో తెలంగాణకు చెందిన వైష్ణవి వీరవంశం, చెన్నైకు చెందిన నేత్ర కుమనన్ దేశం తరుపున పాల్గొంటున్నారు. ఈ సెయిలింగ్ ప్రపంచ ఛాంపిషన్షిప్కు వేదికగా ముసన్నా బే నిలిచింది. వైష్ణవికి 15 ఏళ్లు ఉండగా ఈ పోటీల్లో పాల్గొనే అత్యంత పిన్న వయస్కురాలు ఈమె కావడం విశేషం. ఇక ఈ పోటీల్లో పాల్గొనేవారి సగటు వయసు 25గా ఉంది.
హైదరాబాదు బాంబే నేషనల్స్తో ప్రతిభ చూపడంతో సెలెక్టర్లు వైష్ణవిపై దృష్టి సారించారు. జాతీయ స్థాయి ర్యాంకింగులో వైష్ణవి రెండవ ర్యాంకు పొందింది. దీంతో సీనియర్ వరల్డ్ ఛాంపియన్షిప్కు ఈమెను ఎంపిక చేసింది ఫెడరేషన్. "సెయిలింగ్ ప్రపంచ ఛాంపియన్షిప్కు తను ఎంపికవ్వడం, భారత్ తరపున ప్రాతినిథ్యం వహించేందుకు అవకాశం దొరకడం పట్ల చాలా సంతోషంగా ఉంది. లేజర్ రేడియల్ బోట్పై కేవలం 6 నెలలు మాత్రమే అనుభవం ఉంది. నా జీవితంలో ఇదొక పెను సవాల్ లాంటిది. ఈ అనుభవం నాకు ఎంతో నేర్పిస్తుంది. నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చి తీర్చి దిద్దిన నా కోచ్ మరియు మెంటార్ సుహేమ్ షేక్కు రుణపడి ఉంటాను" అని వైష్ణవి వెల్లడించింది. అక్కడి వాతావరణంకు అలవాటు పడేందుకు ఇప్పటికే వైష్ణవి ఒమన్కు చేరుకుంది.

ఆగష్టులో హైదరాబాదులో జరిగిన సెయిలింగ్ పోటీల్లో మూడు ట్రోఫీలను కైవసం చేసుకుని సెయిలింగ్ కమ్యూనిటీ మన్ననలు పొందింది.ఆ తర్వాత ముంబైలో జరిగిన జాతీయ సెయిలింగ్లో కాంస్య పతకం సాధించింది. వెంట్రుకవాసిలో సిల్వర్ మెడల్ చేజార్చుకుంది. ఇక టోక్యో ఒలింపిక్స్లో పాల్గొన్న నేత్ర కుమనన్ కూడా ఈ పోటీల్లో పాల్గొంటోంది. కచ్చితంగా పతకం సాధిస్తుందనే అంచనాలు నేత్రపై ఉన్నాయి. దాదాపు 30 దేశాల నుంచి పోటీదారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. ఒలింపిక్స్ తర్వాత నేత్రకు ఇదే అతిపెద్ద ఈవెంట్ కావడం విశేషం. ఈ మధ్యే స్పెయిన్లో జరిగిన సెయిలింగ్ పోటీల్లో బంగారు పతకం కైవసం చేసుకుంది.
వైష్ణవి పతకం సాధిస్తుందనే అంచనాలు మాత్రం పెట్టుకోవద్దని, అయితే ఆమెకున్న టాలెంట్ చూశాక కచ్చితంగా అంతర్జాతీయ వేదికలపై అవకాశాలు ఇవ్వాలన్న భావన కలిగిందని అన్నారు యాచ్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ప్రెసిడెంట్ సుహేమ్ షేక్. ఇక ఈ అనుభవం వైష్ణవికి సామర్థ్యానికి పనికొస్తుందని చెప్పారు. ఈ ఏడాది థాయ్లాండ్లో జరిగిన ఏషియన్ ఛాంపియన్షిప్కు తెలంగాణ నుంచి నేషనల్ ఛాంపియన్ రవళి పరాంది మరియు ఝాన్సీ ప్రియలు పాల్గొన్నారు. వీరిలో రవళి 9వ స్థానంతో సరిపెట్టుకుంది.
-
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
కేటీఆర్ చుట్టూ కొత్త వివాదం, ఏం జరుగుతోంది..!! -
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..!












Click it and Unblock the Notifications