రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ!
తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డులు ఉన్నవారికి తాజాగా శుభవార్త చెప్పింది. వచ్చే నెలలో తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ దుకాణాలను ప్రారంభించనున్నట్టు తెలంగాణ పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. రేషన్ కార్డుదారులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా, ఈ కొత్త షాపుల ఏర్పాటుతో రేషన్ సరుకుల పంపిణీ మరింత వేగవంతం అవుతుందని, లబ్ధిదారులకు మరింత మెరుగైన సేవలు అందుతాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.
ఏప్రిల్ లో మూడు నెలల రేషన్ కోటా పంపిణీ
ఇదిలా ఉంటే ఎండల తీవ్రతను పరిగణనలోకి తీసుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా మరొక కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఏప్రిల్, మే, జూన్ నెలకు సంబంధించిన మూడు నెలల రేషన్ కోటాను ఒకేసారి ఏప్రిల్ నెలలో పంపిణీ చేయనున్నాయి. దీనివల్ల తీవ్రమైన ఎండలలో పదేపదే రేషన్ షాపులకు వెళ్లకుండా లబ్ధిదారులకు మేలు జరుగుతుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం నుండి రేషన్ షాపులకు బియ్యం సరఫరాను మొదలుపెట్టింది.

వచ్చే నెలలో రేషన్ ఇస్తారిలా
ప్రస్తుతం రేషన్ కార్డులో ఉన్న ఒక్కొక్క సభ్యులకు ఆరు కిలోల సన్న బియ్యం అందుతుంది. అయితే మూడు నెలల కోటాను ఒకేసారి ఇస్తున్న కారణంగా వచ్చే నెలలో ఒక్కో లబ్దిదారునికి 18 కిలోల బియ్యం లభిస్తుంది. మొత్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ సరఫరాల విషయంలో తీసుకున్న ఈ నిర్ణయం రేషన్ కార్డుదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది గతంలోనూ అనేక సార్లు ఒకేసారి మూడు నెలల రేషన్ ను పంపిణీ చేశారు.
అంత్యోదయ కార్డుల వారికి రేషన్ ఇలా
ఇదిలా ఉంటే అంత్యోదయ కార్డులు ఉన్న వారికి నెలకు 35 కిలోల చొప్పున మూడు నెలలకు 105 కిలోలు రేషన్ అందుతుంది. ఇక ప్రస్తుతం రేషన్ కార్డుదారులు పోర్టబిలిటీ సౌకర్యం ఉన్న కారణంగా ఏ రేషన్ షాప్ లో నుంచైనా రేషన్ తీసుకోవచ్చు. మూడు నెలల బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేస్తున్న కారణంగా బయోమెట్రిక్ మెషిన్ లలో సాఫ్ట్వేర్ ను అప్డేట్ చేస్తున్నారు.
సరఫరా విషయంలో ప్రణాళిక చేస్తున్న పౌర సరఫరాల శాఖ
ఈ క్రమంలో ఒకేసారి మూడు నెలల వేలిముద్ర ధృవీకరణలను తీసుకునేలా బయోమెట్రిక్ మెషీన్ లలో మార్పులు చేస్తున్నారు. అయితే వందల క్వింటాళ్ల బియ్యాన్ని నిల్వ చేయడానికి రేషన్ షాపుల్లో ప్రస్తుతం తగినంత స్థలం లేదని సమస్య తలెత్తుతోంది. ప్రస్తుతం రేషన్ షాపులు చాలా చిన్న చిన్న షాపులలో నడుస్తున్నాయి. డిమాండ్ మేరకు డీలర్లకు సరుకులను సరఫరా చేయడానికి ఈ నేపథ్యంలో పౌరసరఫరాల శాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
-
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
ఆర్టీవో ఆఫీసులకు తిరిగే పని లేకుండా తెలంగాణా వాహనదారులకు సీఎం రేవంత్ శుభవార్త! -
తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే 15శాతం వేతనం వారి బ్యాంకు ఖాతాల్లో.. సభలో కీలక బిల్లు! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్..













Click it and Unblock the Notifications