ఢిల్లీలో కిడ్నాప్కుగురైన మెడికో శ్రీకాంత్గౌడ్ కేసులో పురోగతి
ఓలా క్యాబ్ డ్రైవర్ చేతిలో కిడ్నాప్కు గురైన వైద్య విధ్యార్థి శ్రీకాంత్గౌడ్ కేసులో ఢిల్లీ పోలీసులు పురోగతిని సాధించారు. ఈ కేసును క్షణంలోనైనా చేధిస్తామని పోలీసులు చెబుతున్నారు.
న్యూఢిల్లీ: ఓలా క్యాబ్ డ్రైవర్ చేతిలో కిడ్నాప్కు గురైన వైద్య విధ్యార్థి శ్రీకాంత్గౌడ్ కేసులో ఢిల్లీ పోలీసులు పురోగతిని సాధించారు. ఈ కేసును క్షణంలోనైనా చేధిస్తామని పోలీసులు చెబుతున్నారు.
కిడ్నాప్ చేసిన క్యాబ్ డ్రైవర్ వాహనంలో ఉన్న జిపిఎస్ను ఆఫ్చేసి కారునెంబర్ ప్లేట్ మార్చి తిరుగుతున్నట్టు గుర్తించారు. అయితే నిందితుడు చాలా పకడ్బందీగా వ్యవహరించాడు.
నిందితుడు ప్లాన్ ప్రకారంగా వ్యవహరించినట్టుగా పోలీసులు అభిప్రాయపడుతున్నారు. అయితే నిందితుడిని పట్టుకొనేందుకుగాను పోలీసులు అన్నిరకాల చర్యలను తీసుకొంటున్నారు. 20 ప్రత్యేక బృందాలతో పోలీసులు నిందితుడిని పట్టుకొనేందుకు చర్యలను తీసుకొంటున్నారు.
తెలంగాణ రాష్ట్రం నుండి రాహుల్ అనే ఏసీపీ ఈ కేసును ఢిల్లీలో దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని ఏ క్షణంలోనైనా పట్టుకొనే అవకాశం ఉందని పోలీసులు ఆశాభావంతో ఉన్నారు.

కిడ్నాప్లో ఆసక్తికర అంశాలు
కిడ్నాప్ వ్యవహరంలో ఆసక్తికర అంశాలు వెలుగుచూస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. నిందితుడు పక్కా స్కెచ్తో వ్యవహరించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఫ్రోఫెషనల్ ఉద్యోగిని కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేయాలని నిర్ణయించుకొన్నాడని పోలీసులు అభిప్రాయంతో ఉన్నారు. ఈ నెల 6వ, తేదిన ఉదయం నుండి ఎనిమిదిమంది ఓలా క్యాబ్ను బుక్ చేసుకొన్నారు. అయితే వారితో వెళ్ళేందుకు నిరాకరించాడు. చివరకు శ్రీకాంత్గౌడ్ ప్రోఫెషనల్గా గుర్తించి అతనిని కిడ్నాప్ చేయాలని నిర్ణయించుకొన్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
Recommended Video


తప్పుడు ఐడితో లాగిన్
నిందితుడు లాగిన్ అయిన ఐడీ త్రిపాఠిదిగా పోలీసులు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారించారు. నాకేం తెలియదు. అంటూ అతడు సమాధానం చెబుతున్నాడు. ఏజంట్ అన్సారీని గతంలో కలిశానని, తన ఐడీలోకి లాగిన్ అవ్వడంలో సమస్య ఎదురైతే అన్సారీని సంప్రదించినట్టు చెప్పారు అయితే అన్సారీ అదే ఐడిని గుర్తుపెట్టుకొని కిడ్నాప్ చేసిన నిందితుడికి ఇచ్చి లాగిన్ చేయించినట్టు అన్సారీ, సంజయ్ త్రిపాఠీలను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

ఓలా సంస్థ వైఫల్యం
సరైన పత్రాలు లేక మూడుసార్లు తిరస్కరణకు గురైన వ్యక్తి తప్పుడు ధృవీకరణ పత్రాలు సమర్పించి ఇతర డ్రైవర్ల ఐడీ ద్వారా ధరఖాస్తు చేసుకొంటే ఎలా ఎంపిక చేస్తారని త్రిపాఠి ప్రశ్నిస్తున్నాడు.అయితే తనకు ఎలాంటి సంబంధంలేకున్నా తాను ఇరుక్కొన్నానని చెప్పారు. ఓలా తన క్యాబ్ సర్వీసులను నిలిపివేసిందని ఆవేదన చెందుతున్నాడు. ఏజంట్లు, కమీషన్ల కోసం తప్పుడు ధృవీకరణపత్రాలు సమర్పించి డ్రైవర్లను చేర్చుతున్నారని ఆరోపిస్తున్నాడు.

వెరిఫికేషన్ జరిగేలోపుగానే కిడ్నాప్
ఓలా సర్వీసులు నడపడానికి నిందితుడు సమర్పించిన పత్రాలు సక్రమంగా లేవని తేలిపోతాయి.అయితే ఆ లోపుగానే తన పనిని పూర్తిచేసుకోవాలని నిందితుడు ప్లాన్ చేశాడు. ఈ నెల4వ, తేదిన ఆయన ఓలాలో చేరాడు. ఈ నెల 6వ,తేదిన శ్రీకాంత్గౌడ్ను కిడ్నాప్ చేశాడు.
-
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!! -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..?












Click it and Unblock the Notifications