Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రోడ్డెక్కిన తెలంగాణా ప్రభుత్వం.. ఈడీ ఆఫీస్ ముందు ధర్నా!

ఎక్కడైనా అధికారంలో ఉన్న ప్రభుత్వం ధర్నాలు చెయ్యదు. కానీ అధికారంలో ఉన్న ప్రభుత్వం తెలంగాణా రాష్ట్రంలో రోడ్డెక్కింది. తెలంగాణా మంత్రులు ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. అదానీ వ్యవహారంపై ఈడీ కార్యాలయం వద్ద తెలంగాణా కాంగ్రెస్ నేతలు నిరసన చేపట్టారు.

రోడ్డెక్కిన తెలంగాణా మంత్రులు
ఏఐసీసీ పిలుపు మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో అసెంబ్లీ ఎదుట గన్ పార్క్ నుండి ఈడీ కార్యాలయం వరకు భారీ ప్రదర్శన నిర్వహించింది. ఈడీ కార్యాలయం వద్ద తెలంగాణా కాంగ్రెస్ నేతలు నిరసన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా హిండెన్ బర్గ్ ఆరోపణలతో సెబీ చీఫ్ మాధబిపురి బచ్ పైన తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Telangana Ministers and congress leaders Dharna in front of ED office on adani mega scam

అదానీ వ్యవహారంపైన తేల్చాలని కోరుతూ ధర్నా
కాంగ్రెస్ పార్టీ అదాని మెగా కుంభకోణం పైన దర్యాప్తు జరపాలని దేశవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది. తెలంగాణలో దీనిపైన అధికార కాంగ్రెస్ ఆధ్వర్యంలో మెగా ధర్నా నిర్వహించారు. బిజినెస్ మాన్ అదానీ వ్యవహారంపైన తేల్చాలని కోరుతూ ధర్నా చేశారు.సెబీ చీఫ్ మాధబిపురి బచ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అదానీ వ్యవహారంపైన జేపీసీ దర్యాప్తు చేపట్టాలని ఆందోళన నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నేతలు, మంత్రులు హిండెన్ బర్గ్ చేసిన ఆరోపణలపైన స్పందించారు.

కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా నిరసనలు.. తెలంగాణాలోనూ
సెబి నిబంధనలు ఉల్లంఘించినట్టు మాధవిపై ఇటీవల హిండెన్ బర్గ్ ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో చర్యలు తీసుకోవాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. దీంతో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఈడీ కార్యాలయాల వద్ద నేతలు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రంలోనూ పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు.

పార్లమెంటరీ కమిటీ వేసి విచారణ జరిపించాలని డిమాండ్
ధర్నా సందర్భంగా మాట్లాడిన మంత్రి పొన్నం ప్రభాకర్ అదాని అప్రజాస్వామికంగా దేశసంపదని కొల్లగొడుతున్నారని ఆరోపించారు. పార్లమెంటరీ కమిటీ వేసి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాల మీద అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు జేపీసీ వేసిన సందర్భాలు ఉన్నాయని వీరు ఈ సందర్భంగా గుర్తు చేశారు.

బిజెపి పాలనలో ఈడీ ఆఫీసుల ముందు ధర్నాలు చెయ్యాల్సి వస్తుంది
పదేళ్ల బిజెపి పాలనలో ఈడీ ఆఫీసుల ముందు కూడా ధర్నాలు చేసే పరిస్థితి వస్తుందని ప్రజలు ఊహించలేదని వారు పేర్కొన్నారు. ఇక ఈ ధర్నా కార్యక్రమంలో మంత్రి తుమ్మల, మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి సీతక్క, ఎంపీలు మల్లు రవి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి, దానం నాగేందర్ ,జయవీర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+