మంత్రి సబిత, అధికారులకు గవర్నర్ తమిళిసై అపాయింట్మెంట్ ఖరారు
హైదరాబాద్: యూనివర్సిటీల ఉమ్మడి నియామకాల బిల్లుపై సందేహాలు నివృత్తి చేయాలన్న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆదేశాలు చేసిన క్రమంలో సమయం కోరిన విద్యాశాఖ మంత్రి, అధికారులకు రాజ్భవన్ అపాయింట్ మెంట్ ఖరారు చేసింది.
గురువారం సాయంత్రం 5 గంటలకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విద్యా శాఖ అధికారులు కలిసేందుకు రావాచ్చని సూచించింది. అసెంబ్లీ ఆమోదించిన వర్సిటీ ఉమ్మడి నియామకాల బిల్లును ఆమోదించకుండా గవర్నర్ కావాలనే జాప్యం చేస్తున్నారంటూ వచ్చిన విమర్శల నేపథ్యంలో సందేహాలు నివృత్తి చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి రాజ్ భవన్ లేఖ రాసింది.

అయితే, తనకింకా లేఖ అందలేదని మంత్రి సబితా ఇంద్రారెడ్డి బుధవారం వ్యాఖ్యానించారు. మరోవైపు, నిన్న గవర్నర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. బిల్లులు పంపగానే ఆమోదం తెలపలా? దాన్ని పరిశీలించాల్సిన, అధ్యాయనం చేయాల్సిన అవసరం లేదా? అని ప్రశ్నించారు.
తనకు బిల్లులపై సందేహాలుంటే నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు గవర్నర్. అన్ని రకాలుగా పారదర్శకత ఉంటూనే బిల్లులను ఆమోదించడం జరుగుతుందన్నారు. మరోవైపు, బిల్లులపై సందేహాలుంటే తాము గవర్నర్ ను కలిసి నివృత్తి చేస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.
ఈ నేపథ్యంలోనే అపాయింట్మెంట్ కోరగా.. రాజ్ భవన్ ఖరారు చేసింది. దీంతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ అధికారులు గురువారం సాయంత్రం గవర్నర్ తమిళిసైని కలిగి.. బిల్లుపై ఉన్న సందేహాలపై చర్చించనున్నారు.
-
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !!












Click it and Unblock the Notifications