Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Telangana: మున్సిపాల్టీల్లో ఎక్స్ ఆఫీషియో ఓటు వారికే..! తేల్చేసిన ఈసీ..!

తెలంగాణలో ఉత్కంఠభరితంగా సాగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు (telangana municipal eletion results) వెలువడ్డాయి. అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ 74 మున్సిపాలిటీలతో పాటు 3 కార్పోరేషన్లలో విజయంసాధించింది. బీఆర్ఎస్ 17 చోట్ల గెలిచింది. మరో 24 చోట్ల ఎవరికీ మెజార్టీ రాక హంగ్ ఏర్పడింది. దీంతో ఆయా స్థానిక సంస్థలను దక్కించుకోవాలంటే అధికార, విపక్షాలకు ఇప్పుడు ఎక్స్ అఫీషియో ఓట్లు కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో ఈసారి మున్సిపల్ పీఠాల పోరులో ఎక్స్ అఫీషియో సభ్యులెవరో ఎస్ఈసీ క్లారిటీ ఇచ్చింది.

తెలంగాణ మున్సిపాలిటీలో చట్టం-2019 ప్రకారం ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఓటు హక్కు ఎవరికి ఉంటుందో తెలియజేస్తూ ఎస్ఈసీ రాణికుముదిని ఓ ప్రకటన చేశారు. ఇందులో రాజ్యసభ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర ఎక్స్‌అఫీషియో సభ్యులకు ఓటు హక్కు తప్పనిసరి అని తెలిపారు. అలాగే ఆయన మున్సిపాలిటీలు, లేదా కార్పోరేషన్ పరిధిలో ఓటరుగా నమోదు కానివారు ఓటు వేసేందుకు అనర్హులని ఆమె పేర్కొన్నారు.

Telangana SEC Clarifies Ex-Officio Vote Eligibility Amid Hung Municipal Polls

ఎమ్మెల్యేలు, లోక్ సభ సభ్యులు తమ నియోజకవర్గ పరిధిలోని ఏదో ఒక మున్సిపాలిటీలు ఎక్స్ అఫీషియా ఓటు హక్కు వినియోగించుకోవచ్చని ఎస్ఈసీ తెలిపారు. రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు మాత్రం తమకు ఓటు హక్కు ఉన్న చోట మాత్రమే ఎక్స్ అఫీషియో ఓటు వేయాల్సి ఉంటుంది. అలాగే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు తమ ఎక్స్ అఫీషియో ఓటు హక్కు నమోదు చేసుకునేందుకు ఇవాళ్టి వరకూ ఎస్ఈసీ గడువునిచ్చారు. దీంతో వారంతా ఎక్స్ అఫీషియో ఓటు హక్కు నమోదుకు బయలుదేరుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+