Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!!

విద్యుత్ వినియోగదారులకు బిగ్ అలర్ట్. ఈ రోజు (బుధవారం) నుంచి కొత్త విద్యుత్ ఛార్జీలు అమల్లోకి వచ్చాయి. కరెంటు కేటగిరీల్లో మార్పులు చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసారు. దీని ద్వారా కొత్త ఆర్దిక సంవత్సరంలో రెండు రకాలుగా ఛార్జీలు వసూలు చేయాలని డిసైడ్ అయ్యారు. పీక్ అవర్స్ లో విద్యుత్ వినియోగిస్తే అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టత ఇచ్చారు.

తెలంగాణలో ఈ రోజు నుంచి విద్యుత్ ఛార్జీల్లో మార్పు చేసారు. రాష్ట్రంలో హెచ్‌టీ, వాణిజ్య వర్గాల వారికి డిమాండ్‌ లేని సమయంలో విద్యుత్తు వినియోగానికి ఇస్తున్న రాయితీలను ఎత్తివేయాలని డిస్కమ్‌లు తెలంగాణ విద్యుత్తు నియంత్రణ మండలి (టీజీఈఆర్‌సీ)'కి ప్రతిపాదించాయి. కాగా, డిమాండ్‌ లేని సమయంలో ప్రధానంగా సౌర విద్యుత్తు అందుబాటులోకి వచ్చినప్పుడు ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల దాకా కరెంటును వినియోగిస్తే యూనిట్‌కు 50పైసల రాయితీ ఇస్తూ ఈఆర్‌సీ నిర్ణయం తీసుకుంది. గతంలో ఈ రాయితీ రూ.1 ఉండగా.. కొన్ని నెలల కింద డిస్కమ్‌లు దాన్ని నిలిపివేశాయి. తాజా ఆర్థిక సంవత్సరం పిటిషన్లపై విచారణ సందర్భంగా పారిశ్రామిక వర్గాలు గణాంకాలతో సహా వివరించడంతో ఈఆర్‌సీ టైమ్‌ ఆఫ్‌ డే (టీవోడీ- డిమాండ్‌ లేని సమయంలో రాయితీ, డిమాండ్‌ ఉన్న సమయంలో అదనపు చార్జీల వసూలు) రాయితీని పునరుద్ధరించింది. గతంలో రూ.1గా ఉన్న రాయితీని 50 పైసలు చేసింది. అలాగే డిమాండ్‌ అధికంగా(పీక్‌) ఉన్న సమయంలో ఉదయం 6 నుంచి 10 గంటల మధ్య, మళ్లీ సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల మధ్య విద్యుత్తు వినియోగానికి అదనంగా రూ.1.50 చార్జీ విధించింది.

వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!!
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!!
telangana-state-electricity-regulatory-commission-approving-revised-electricity-wheeling-tariffs-for

తాజా మార్పులు.. నేటి నుంచి అమలు

అయితే, గతంలో ఇది రూ.1గా ఉండేది. ఇక రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల దాకా (ఈఆర్‌సీ ఖరారు చేసిన) సాధారణ చార్జీలను వర్తింపజేయనున్నారు. ఇవి హెచ్‌టీ, వాణిజ్య వర్గాల వారికి అమలు కానున్నాయి. మరోవైపు 2026-27 ఆర్థిక సంవత్సరానికిగాను డిస్కమ్‌లు రూ.72,996 కోట్ల వార్షిక ఆదాయ అవసరాలు (ఏఆర్‌ఆర్‌) ఉన్నట్లు ప్రతిపాదనలు సమర్పించగా.. అభ్యంతరా ల స్వీకరణ, బహిరంగ విచారణ అనంతరం ఈఆర్‌సీ ఆ మొత్తాన్ని రూ.64,950కోట్లకు కుదించింది. కాగా.. ఏ విభాగంలోనూ విద్యుత్తు చార్జీలను పెంచలేదు. ఇది సామాన్య వినియోగ దారుడికి రిలీఫ్ గా మారుతోంది. దీని ద్వారా 2026-27లోనూ పాత చార్జీలే అమలు కానున్నాయి. ఈ మేరకు 2026-27కు గాను ఈఆర్‌సీ టారిఫ్‌ ఉత్తర్వులను విడుదల చేసింది. రెవెన్యూ లోటును రూ.22,104కోట్లుగా చూపించగా.. రూ.14,059కోట్లకు కుదించింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+