మాట్లాడనివ్వండి: స్పీకర్కు టీ- టీడీపీ ఎమ్మెల్యేలు
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసన సభ్యులు శుక్రవారం ఉదయం శాసనసభ సభాపతి తెలంగాణ ధుసూదనా చారిని కలిశారు. బడ్జెట్ సమావేశాల్లో తమకు మాట్లాడేందుకు అవకాశం కల్పించాలని కోరారు. తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు ఆర్ కృష్ణయ్య, మాధవరం కృష్ణారావులు సభాపతిని కలిశారు. కాగా, గురువారం పదిమంది టీడీపీ ఎమ్మెల్యేల పైన వారం పాటు సస్పెన్షన్ వేటు వేసిన విషయం తెలిసిందే.
శాసన సభ ప్రాంగణంలో టీడీపీ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ... అధికార తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలు గట్టి బుద్ధి చెబుతారన్నారు. తమ పైన సస్పెన్షన్ వేటు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అధికారం శాశ్వతమని తెరాస భావిస్తోందన్నారు. మమ్మల్ని గెలిపించిన ప్రజలకు తాము జవాబుదారిగా ఉంటామన్నారు. కావాలనే అధికార పార్టీ తమ గొంతు నొక్కిందన్నారు.
మరోవైపు, శాసన సభలో పాఠశాల విద్య పైన వాడిగా వేడిగా చర్చ సాగుతోంది. ప్రభుత్వ పాఠశాలలు తన నియోజకవర్గంలో అద్భుతంగా నడుస్తున్నాయని బీజేపీ ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి తన నియోజకవర్గంలో గత 10 సంవత్సరాల నుంచి నిరంతర ప్రయత్నాలు చేశానని, సుమారు 17 నూతన భవనాలను నిర్మించినట్లు తెలిపారు.

పాఠశాలలో మౌలిక సదుపాయాలపై దృష్టి సారించాలని కోరారు. జిల్లాల వారీగా ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి మెరుగుపర్చేందుకు స్థానికంగా ఉన్న అన్ని జిల్లాల శాసనసభ్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించాలన్నారు. ప్రతీ ఎమ్మెల్యే ఒకటి రెండు పాఠశాలలను ఆదర్శంగా తీసుకుని అభివృద్ధి చేస్తే ప్రభుత్వ పాఠశాలల పట్ల ప్రజలకు విశ్వాసం పెరుగుతుందన్నారు.
హేతుబద్దీకరణ పేరుతో స్కూళ్ల మూసివేత సరికాదని బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. అన్ని పాఠశాలలో టీచర్ల కొరత అధికంగా ఉందన్నారు. డీఎస్సీ పరీక్షలు నిర్వహించి టీచర్ల కొరతను నివారించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలో ఉచిత విద్య, మధ్యాహ్న భోజన సదుపాయాలు కల్పించినప్పటికీ పేద విద్యార్థులు పాఠశాలలో చేరడం లేదన్నారు.
ఉపాధ్యాయులు పాఠశాలల అభివృద్ధికి, విద్యార్థుల ఉత్తీర్ణతకు చేసే ప్రయత్నాలను మరింత పెంచింతే బాగుంటుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలంటేనే దయనీయమైన పరిస్థితి నెలకొందన్నారు. పాఠశాలల ప్రమాణాలు పెంచేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. చాలా ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు లేవని చంతల రామచంద్రా రెడ్డి అన్నారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications