మాట్లాడనివ్వండి: స్పీకర్కు టీ- టీడీపీ ఎమ్మెల్యేలు
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసన సభ్యులు శుక్రవారం ఉదయం శాసనసభ సభాపతి తెలంగాణ ధుసూదనా చారిని కలిశారు. బడ్జెట్ సమావేశాల్లో తమకు మాట్లాడేందుకు అవకాశం కల్పించాలని కోరారు. తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు ఆర్ కృష్ణయ్య, మాధవరం కృష్ణారావులు సభాపతిని కలిశారు. కాగా, గురువారం పదిమంది టీడీపీ ఎమ్మెల్యేల పైన వారం పాటు సస్పెన్షన్ వేటు వేసిన విషయం తెలిసిందే.
శాసన సభ ప్రాంగణంలో టీడీపీ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ... అధికార తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలు గట్టి బుద్ధి చెబుతారన్నారు. తమ పైన సస్పెన్షన్ వేటు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అధికారం శాశ్వతమని తెరాస భావిస్తోందన్నారు. మమ్మల్ని గెలిపించిన ప్రజలకు తాము జవాబుదారిగా ఉంటామన్నారు. కావాలనే అధికార పార్టీ తమ గొంతు నొక్కిందన్నారు.
మరోవైపు, శాసన సభలో పాఠశాల విద్య పైన వాడిగా వేడిగా చర్చ సాగుతోంది. ప్రభుత్వ పాఠశాలలు తన నియోజకవర్గంలో అద్భుతంగా నడుస్తున్నాయని బీజేపీ ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి తన నియోజకవర్గంలో గత 10 సంవత్సరాల నుంచి నిరంతర ప్రయత్నాలు చేశానని, సుమారు 17 నూతన భవనాలను నిర్మించినట్లు తెలిపారు.

పాఠశాలలో మౌలిక సదుపాయాలపై దృష్టి సారించాలని కోరారు. జిల్లాల వారీగా ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి మెరుగుపర్చేందుకు స్థానికంగా ఉన్న అన్ని జిల్లాల శాసనసభ్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించాలన్నారు. ప్రతీ ఎమ్మెల్యే ఒకటి రెండు పాఠశాలలను ఆదర్శంగా తీసుకుని అభివృద్ధి చేస్తే ప్రభుత్వ పాఠశాలల పట్ల ప్రజలకు విశ్వాసం పెరుగుతుందన్నారు.
హేతుబద్దీకరణ పేరుతో స్కూళ్ల మూసివేత సరికాదని బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. అన్ని పాఠశాలలో టీచర్ల కొరత అధికంగా ఉందన్నారు. డీఎస్సీ పరీక్షలు నిర్వహించి టీచర్ల కొరతను నివారించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలో ఉచిత విద్య, మధ్యాహ్న భోజన సదుపాయాలు కల్పించినప్పటికీ పేద విద్యార్థులు పాఠశాలలో చేరడం లేదన్నారు.
ఉపాధ్యాయులు పాఠశాలల అభివృద్ధికి, విద్యార్థుల ఉత్తీర్ణతకు చేసే ప్రయత్నాలను మరింత పెంచింతే బాగుంటుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలంటేనే దయనీయమైన పరిస్థితి నెలకొందన్నారు. పాఠశాలల ప్రమాణాలు పెంచేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. చాలా ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు లేవని చంతల రామచంద్రా రెడ్డి అన్నారు.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications