మోత్కుపల్లికి రమణ కౌంటర్: బాలకృష్ణ రియాక్షన్ ఇది
హైదరాబాద్: టిడిపి తెలంగాణ రాష్ట్ర శాఖను టిఆర్ఎస్లో విలీనం చేయాలనే పార్టీ సీనియర్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు చేసిన వ్యాఖ్యలను టిడిపి తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఎల్. రమణ తోసిపుచ్చారు. తెలంగాణలో పార్టీకి ఎలాంటి ఢోకాలేదని రమణ అభిప్రాయపడ్డారు.
తెలంగాణలో టిడిపి ఉనికి కోల్పోతున్న పరిస్థితి కన్పిస్తోంది. పార్టీకి చెందిన ముఖ్య నేతలు పార్టీని వీడి వెళ్ళారు. టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో టిడిపి నేతలు చేరారు. రేవంత్ రెడ్డి ఎపిసోడ్ టిడిపిని తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది.
Recommended Video

ఈ పరిణామాలు తెలంగాణ టిడిపికి చెందిన నేతలను గందరగోళానికి గురి చేస్తున్నాయి. అయితే తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ప్రతి నెల ఒక్క రోజును కేటాయిస్తానని హమీ ఇచ్చారు. కానీ, ఆ హమీని మాత్రం అమలుకు నోచుకోలేదు.

తెలంగాణలో టిడిపికి ఢోకా లేదు
తెలంగాణలో టిడిపికి ఢోకా లేదని టిడిపి తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఎల్. రమణ చెప్పారు. టిడిపి పొలిట్బ్యూరో సభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు చేసిన వ్యాఖ్యలపై పార్టీలో చర్చిస్తామని చెప్పారు. తెలంగాణలో గ్రామ గ్రామాన పార్టీ కమిటీలున్నాయని రమణ చెప్పారు. తెలంగాణలో టిడిపి రాష్ట్ర శాఖ ఉంటుందని రమణ్ చెప్పారు. తెలంగాణలో పార్టీకి ఎలాంటి నష్టం లేదని రమణ చెప్పారు.

ఏదైనా మాట్లాడే స్వేచ్ఛ ఉంటుంది
పార్టీలో ఎవరైనా తమ అభిప్రాయాలనుస్వేచ్ఛగా చెప్పే అలవాటు ఉందని ఎల్. రమణ చెప్పారు. అయితే నర్సింహులు లేవనెత్తిన విషయాలపై పార్టీ పొలిట్ బ్యూరో లో చర్చించనున్నట్టు చెప్పారు. తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పొచ్చని రమణ తేల్చి చెప్పారు. వ్యక్తులుగా వారు మాట్లాడే విషయాలను వారి విచక్షణకు వదిలేస్తామని రమణ చెప్పారు.

మోత్కుపల్లి వ్యాఖ్యలు అప్రస్తుతం
మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు వ్యాఖ్యలు అప్రస్తుతమని సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలపై ఆయన పెద్దగా స్పందించలేదు. ఈ సమయంలో తాను మోత్కుపల్లి వ్యాఖ్యలపై స్పందినని బాలకృష్ణ చెప్పారు.

మోత్కుపల్లి వ్యాఖ్యల కలకలం
తెలంగాణ టిడిపి సీనియర్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు టిడిపిని టిఆర్ఎస్లో విలీనం చేయాలని చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలాన్రి రేపాయి. మోత్కుపల్లి ఈ వ్యాఖ్యలు ఏ ఉద్దేశ్యంతో చేశారోననే చర్చ సర్వత్రా సాగుతోంది. మరో వైపు రేవంత్ రెడ్డి ఎపిసోడ్ సమయంలో టిఆర్ఎస్ల మధ్య పొత్తు పెట్టుకోవాలని మోత్కుపల్లి చెప్పారు. రేవంత్ మాత్రం కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని కోరారు.ఆనాడు మోత్కుపల్లి చేసిన వ్యాఖ్యలు కలకలాన్ని రేపాయి. ప్రస్తుతం మోత్కుపల్లి చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో టిడిపికి ఇక మనుగడ లేదనే పరిస్థితి పార్టీ నేతల్లో నెలకొందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు కన్పించిందని రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications