హైదరాబాద్ to అరుణాచలం.. 4 రోజుల ట్రిప్.. ఇంత తక్కువ ధరకే..
దేశంలోని ప్రముఖ శైవ క్షేత్రాల్లో అరుణాచలం ముఖ్యమైనదిగా చెబుతుంటారు. నిత్యం లక్షలాదిమంది భక్తులతో ఈ ఆలయం కిటకిటలాడుతుంది. దక్షిణాది రాష్ట్రాల నుంచే కాకుండా దేశవ్యాప్తంగా భక్తులు ఈ ఆలయాన్ని దర్శిస్తుంటారు. అరుణాచలంలో గిరి ప్రదక్షిణకు విశేషమైన గుర్తింపు ఉంది. పంచ భూత లింగాలలో ఒకటైన అరుణాచం దేవాలయం చుట్టూ పౌర్ణమి రోజున గిరి ప్రదక్షిణ చేసేందుకు భక్తులు లక్షలాది మంది తరలివస్తారు. ఇక అరుణాచలంలో అరుణ అంటే ఎర్రని.. అచలం అంటే కొండ అని అర్థం వస్తుంది. అంటే ఎర్రని కొండ అని సమాధానం. అదే తమిళంలో అయితే 'తిరువన్నామలై' అంటారు. శివ భక్తులు తిరువాన్నామలైని కైలాస పర్వతంగా కొలుస్తారు. తిరు అంటే శ్రీ, అణ్ణామలై అంటే పెద్ద కొండ అని అర్థం వస్తుంది. తెలుగు రాష్ట్రాల నుంచి నిత్యం వేలాదిమంది భక్తులు అరుణాచలం సందర్శిస్తుంటారు.
అయితే అరుణాచలం పుణ్యక్షేత్రానికి వెళ్లే వారికోసం తెలంగాణ టూరిజం ప్రత్యేక ప్యాకేజీని తీసుకొచ్చింది. అందుకు సంబంధించి సెప్టెంబర్ నెల తేదీలను తాజాగా ప్రకటించింది. హైదరాబాద్ నుంచి ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. గిరి ప్రదక్షిణ కోసం వెళ్లే భక్తులకు తక్కువ ధరలోనే టూర్ ప్యాకేజీ అందుబాటులోకి తీసుకొచ్చేలా తెలంగాణ టూరిజం ప్రణాళికలు రచించింది. ఈ ప్యాకేజీని గత కొంతకాలంగా నిర్వహిస్తూ వస్తోంది. తెలంగాణ టూరిజం బోర్డు నెలల వారీగా తేదీలను ముందుగానే ప్రకటిస్తుంది.
ఇక HYDERABAD - ARUNACHALAM టూర్ మొత్తం 4 రోజుల పాటు సాగుతుంది. వచ్చే సెప్టెంబర్ నెలలో 4 సార్లు ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా అరుణాచలం వెళ్తారు. హైదరాబాద్ నుంచి సెప్టెంబర్ 5, 12, 19, 26 తేదీల్లో అరుణాచలానికి బస్సు బయల్దేరుతుంది. ఈ తేదీలకు అనుగుణంగా టికెట్లను ముందుగానే బుక్ చేసుకోవచ్చు. https://tourism.telangana.gov.in/tours వెబ్ సైట్ లోకి వెళ్లి టికెట్స్ బుకింగ్ చేసుకోవచ్చు.

నాలుగు రోజుల టూర్ లో భాగంగా తొలి రోజు సాయంత్రం 6:30 గంటలకు హైదరాబాద్ లోని బషీర్ బాగ్ నుంచి బస్సు బయల్దేరుతుంది. అలా కాణిపాకం వెళ్లి అక్కడి నుంచి అరుణాచలం చేరుకుంటుంది. అరుణాచలంలో దర్శనం తర్వాత వేలూర్, శ్రీపురం గోల్డెన్ టెంపుల్ ను కూడా దర్శించుకోవచ్చు. నాలుగో రోజు హైదరాబాద్ కు చేరుకోవటంతో ఈ టూర్ ప్యాకేజీ ముగుస్తుంది. ఇక ఈ టూర్ ప్యాకేజీ ధరలు పెద్దలకు ఒక్కో టికెట్ ధర రూ. 8,000 గా ఉంది. పిల్లలు అయితే రూ. 6400 గా ఫిక్స్ చేశారు.
-
హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణపై భారీ శుభవార్త! -
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications