అమెరికాలో తెలంగాణ యువతి అనుమానాస్పద మృతి
తెలంగాణకు చెందిన ఓ యువతి అమెరికాలో ప్రాణాలు తీసుకుంది. మహబూబాబాద్ జిల్లా చింతలపల్లి గ్రామానికి చెందిన సంధ్య టెక్సాస్లో ఆత్మహత్య చేసుకుంది. అయితే సంధ్య మృతిపై ఆమె తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తమ కూతురిది హత్యేనని అంటున్నారు. భర్త, అత్తమామలు కలిసి సంధ్యను హత్య చేశారని ఆరోపిస్తున్నారు.

8 నెలల క్రితం వివాహం
మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలం చింతలపల్లికి చెందిన సెగ్గెం మహేందర్, విమలమ్మ దంపతులకు ముగ్గురు సంతానం. వీరిలో చిన్న కుమార్తె సంధ్యను తొర్రూర్కు చెందిన సమీప బంధువు దూంపల్లి శ్రీకాంత్కు ఇచ్చి ఎనిమిది నెలల క్రితం వివాహం చేశారు. అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న శ్రీకాంత్ తల్లిదండ్రులతో కలిసి టెక్సాస్లో నివాసం ఉంటున్నాడు. పెళ్లి తర్వాత భార్యను తనతో పాటు అక్కడికి తీసుకెళ్లాడు.

రెండు నెలలుగా వరకట్న వేధింపులు?
శ్రీకాంత్, సంధ్యల దాంపత్య జీవితం ఆరు నెలల పాటు సజావుగానే సాగింది. అయితే రెండు నెలలుగా శ్రీకాంత్, అతని తల్లిదండ్రులు సంధ్యను అదనపు కట్నం కోసం వేధించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సంధ్య శనివారం ఉదయం గొంతుకోసుకుని ఆత్మహత్య చేసుకుందని.శ్రీకాంత్ ఆమె బంధువులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చాడు.

సంధ్యను హత్యచేశారంటున్న తల్లిదండ్రులు
సంధ్య ఆత్మహత్య విషయం తెలియగానే ఆమె తల్లిదండ్రులు కుప్పకూలారు. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు పెళ్లై ఏడాది గడవకముందే శవంగా మారడాన్ని తట్టుకోలేకపోయారు. శ్రీకాంత్, అతని తల్లిదండ్రుల వరకట్న వేధింపుల కారణంగానే తమ కూతురు చనిపోయిందని సంధ్య తండ్రి మహేందర్ ఆరోపించారు. ఈ మేరకు తొర్రూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. సంధ్య కుటుంబసభ్యుల్ని పరామర్శించిన పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావ్, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్తో మాట్లాడి మృతదేహాన్ని త్వరగా రప్పించే ప్రయత్నం చేస్తామన్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications