Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఫలితాల ముందు పరేషాన్ చేస్తుండు..! కేసీఆర్ పర్యటనల మర్మం పద్మనాభుడికే తెల్వాలే..!!

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఏది చేసినా కాస్త వెరైటీగానే ఉంటుంది. మీడియా సమావేశాల్లో మాట్లాడే అంశం నుండి బహిరంగ సమావేశాల్లో పబ్లిక్ స్పీచ్ వరకూ ఉత్కంఠ కొనసాగుతూనే ఉంటుంది. తాజాగా దేశ వ్యాప్తంగా ఎన్నికల హడావిడితో రాజకీయాలు వేడెక్కిన తరుణంలో ఫెడరల్ ఫ్రెంట్ బలోపేతం చేసేందుకు దక్షిణ భారత యాత్ర ఆసక్తి రేపుతోంది. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు ఐదు దశలు పూర్తికావడం, మిగిలిన రెండు దశలు కూడా ఈ నెల 19న ముగియనుండగా 23న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. దీంతో ప్రస్తుతం కేంద్రంలో ఎవరు అధికారంలోకి వస్తారోనని జోరుగా చర్చ సాగుతోంది.

కేసీఆర్ దక్షిణ భారత దేశ పర్యటన..! మళ్లీ చర్చనీయాంశమైన ఫెడరల్ ఫ్రంట్..!!

కేసీఆర్ దక్షిణ భారత దేశ పర్యటన..! మళ్లీ చర్చనీయాంశమైన ఫెడరల్ ఫ్రంట్..!!

ఈ సందర్భంగా కాంగ్రెస్‌, బీజేపీకి సొంతంగా మెజారిటీ స్థానాలు వచ్చే అవకాశం లేదని, మూడో ఫ్రంట్‌ లేదా బీజేపీయేతర పక్షాల కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందన్న ప్రచారంతో ప్రధానిగా పలువురి పేర్లు తెరపైకి వచ్చాయి. ఈ క్రమంలో కొంతకాలంగా ఏపీ సీఎం చంద్రబాబు పేరు కూడా వినిపిస్తోంది. చంద్రబాబును వ్యతిరేకిస్తున్న చంద్రశేఖర్ రావు మరోసారి ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటులో భాగంగా వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. అలాగే సోమవారం కేరళకు బయలుదేరే సమయంలో కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి తోనూ చంద్రశేఖర్ రావు ఫోన్‌లో మాట్లాడినట్లు తెలిసింది.

కేసీఆర్ తో వచ్చేది ఎవరు..!!

కేసీఆర్ తో వచ్చేది ఎవరు..!!


నేతలను ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నం..! కేసీఆర్ తో వచ్చేది ఎవరు..!!
15, 16 తేదీల్లో బెంగళూరుకు రావాలని చంద్రశేఖర్ రావును కుమారస్వామి ఆహ్వానించారు. ఫెడరల్ ఫ్రంట్ దిశగా చర్చలు మొదలు పెట్టిన చంద్రశేఖర్ రావు సోమవారం కేరళలో ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్‌తో భేటీ అయ్యారు. తిరువనంతపురం వెళ్లిన చంద్రశేఖర్ రావు, అక్కడ అనంత పద్మనాభస్వామిని దర్శించుకొని, విజయన్‌తో సమావేశమయ్యారు. కలిసిరండి అంటూ.. వామపక్షాలకు పిలుపునిచ్చిన ఆయన ఫెడరల్ ఫ్రంట్‌లో చేరాలని కోరారు. దాదాపు గంటన్నర సేపు ఇరు నేతల మద్య చర్చలు జరిగినట్టు తెలుస్తోంది.

 కేసీఆర్ విజయం సాధిస్తాడా..!!

కేసీఆర్ విజయం సాధిస్తాడా..!!

బీజేపి, కాంగ్రెస్ పై యుద్దం..! కేసీఆర్ విజయం సాధిస్తాడా..!!
ఈ సందర్భంగా చంద్రశేఖర్ రావు ప్రతిపాదనలు ఆచరణీయమని విజయన్ అన్నారు. దీనిపై పార్టీలో చర్చిస్తామని హామీ ఇచ్చారు. అయితే, ఫ్రంట్ ఏర్పాటుకు చంద్రశేఖర్ రావు మరో ముందడుగు వేస్తున్నారు. ఈ నెల 13న చెన్నై వెళ్లనున్నారు. అక్కడ డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌ను ఆయన ఇంట్లో కలవనున్నారు. గత ఏడాది ఏప్రిల్‌లో చెన్నైకి వచ్చిన చంద్రశేఖర్ రావు అప్పుడు డీఎంకే అధినేత కరుణానిధిని పరామర్శించారు.

ఫలితాల ముందు సౌత్.. తర్వాత నార్త్..! కేసీఆర్ వ్యూహం అదే..!!

ఫలితాల ముందు సౌత్.. తర్వాత నార్త్..! కేసీఆర్ వ్యూహం అదే..!!

అలాగే స్టాలిన్‌తో ఫెడరల్‌ ఫ్రంట్‌ అంశంపై చర్చించారు. రెండు రోజులపాటు చెన్నైలో ఉన్న చంద్రశేఖర్ రావు కు డీఎంకే సాదర స్వాగతం పలికింది. తర్వాత ఆగస్టులో కరుణానిధి అంత్యక్రియలకు సీఎం హాజరయ్యారు. ఇప్పుడు మరోసారి 13న చెన్నై వెళ్లనున్నారు. ఈ సందర్భంగా దేశంలోని రాజకీయ పరిస్థితులు, ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల సరళి, ఫలితాల అనంతరం తలెత్తే పరిణామాలు, ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు అంశాలపై వారిద్దరు చర్చించనున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+