Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

హైదరాబాద్ ప్రయాణికులకు తీపికబురు- సిటీబస్సులు ఇకపై.. !!

హైదరాబాద్ ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) తీపికబురు వినిపించింది. నగరం పరిధిలో అన్ని సిటీ బస్సులను కూడా ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చుతోంది. దీనికి సంబంధించిన ఓ బృహత్తర ప్రణాళికను ప్రకటించింది. డీజిల్ ఉద్గారాలను తొలగించడం, ప్రజా రవాణాను ఆధునీకరించిడం, డీజిల్ స్థానంలో ఎలక్ట్రిక్ సిటీ బస్సులను అందుబాటులోకి తీసుకుని రావడానికి ఉద్దేశించిన ప్రణాళిక ఇది.

కొత్త ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలుతో పాటు ప్రస్తుతం అందుబాటులో ఉన్న అన్ని డీజిల్ బస్సులను కూడా ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చుతోంది. రెట్రోఫిట్టింగ్ కార్యాచరణను అమలు చేస్తోంది టీజీఎస్‌ఆర్టీసీ. వేల సంఖ్యలో డీజిల్ బస్సులను విద్యుత్ వాహనాలుగా మార్చే రెట్రోఫిట్టింగ్ ను అమలు చేసిన మొదటి రోడ్డు రవాణా సంస్థ ఇదే. పాత డీజిల్ బస్సులన్నీ కూడా ఇక్కడ ఈవీలుగా రూపాంతరం చెందుతున్నాయి.

TGSRTC Converts its Hyderabad City Diesel Buses to Electric on a Massive Scale with Retrofitment

పైలెట్ ప్రాజెక్ట్ గా చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతమైంది. రెట్రోఫిట్‌మెంట్ కోసం టెండర్లను గత ఏడాది సెప్టెంబర్ 15న ఆహ్వానించారు. 240 బస్సుల రెట్రోఫిట్‌మెంట్ కాంట్రాక్ట్‌ను టీజీఎస్‌ఆర్టీసీ రెండు సంస్థలకు అప్పగించింది. ఇందులో 'సాయి గ్రీన్ మొబిలిటీ'కి 200 బస్సులు, 'కళ్యాణి పవర్‌ట్రైన్ లిమిటెడ్'కు 40 బస్సులు కేటాయించారు. ఈ ప్రణాళికలో భాగంగా మొత్తం 19 డిపోలలో ఛార్జింగ్ సౌకర్యాలు అభివృద్ధి చేస్తున్నారు.

అలాగే 10 కొత్త డిపోలు, 10 కొత్త ఛార్జింగ్ స్టేషన్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఈ మౌలిక వసతుల అభివృద్ధికి సుమారు 392 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. 2023లో ముషీరాబాద్ డిపోకు చెందిన ఒక డీజిల్ బస్సుకు ప్రైవేట్ కంపెనీ సహకారంతో విజయవంతంగా ఎలక్ట్రిక్ బస్సులుగా మార్పు చేశారు. ఈ రెట్రోఫిట్ చేసిన బస్సు ప్రస్తుతం ఉప్పల్ డిపో పరిధిలో సమర్థవంతంగా నడుస్తోంది.

ప్రస్తుతం హైదరాబాద్ పరిధిలో ఆరు డిపోలలో 500 ఎలక్ట్రిక్ బస్సులు సేవలు అందిస్తున్నాయి. 2028 నాటికి అన్ని సిటీ బస్సులను కూడా ఈవీలుగా మార్చనుంది. దీనికోసం టీజీఎస్‌ఆర్టీసీ, తెలంగాణ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఓ సంయుక్త కార్యాచరణ ప్రణాళికను కుదుర్చుకున్నాయి. ఇందులో భాగంగా 392 కోట్ల రూపాయల పెట్టుబడితో సదరన్ డిస్కమ్ మౌలిక వసతులను అభివృద్ధి చేస్తోంది. హైదరాబాద్ సిటీ పరిధిలో బస్సులను ఈవీలుగా మారిన తర్వాత వాటిని నడిపడానికి 124 మెగావాట్ల విద్యుత్ అవసరం.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+