Darmapuri: ధర్మపురిలో రీకౌంటింగ్ జరగడం ఖాయమేనా..!
తెలంగాణ హైకోర్టు ఆదేశాలతో జగిత్యాల జిల్లా ధర్మపురి శాసనసభ నియోజకవర్గం ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్రూమ్ ను అధికారులు ఓపెన్ చేశారు. 2018 జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రకటనలో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. ఎమ్మెల్యేగా గెలిచిన కొప్పుల ఈశ్వర్ ఎన్నిక అక్రమమని ఆరోపించారు. రీ కౌంటింగ్ కోసం హైకోర్టును కోరారు. 441 ఓట్ల తేడాతో తాను ఓటమిపాలు కావడంతో అవకతవకలు జరిగినట్లు అడ్లూరి లక్ష్మణ్ ఆరోపించారు. లక్ష్మణ్ పిటిషన్ ను విచారించిన హైకోర్టు స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేయాలని ఆదేశించింది.
ఎన్నికల ఫలితాలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ ను తెరిచి.. అప్పటి ఎన్నికకు సంబంధించిన 17A,17 C డాక్యుమెంట్ కాపీలను, సీసీ పుటేజీ, ఎన్నికల ప్రొసీడింగ్స్ ను ఏప్రిల్ 11వ తేదీన సమర్పించాలని రిటర్నింగ్ అధికారి భిక్షపతికి హైకోర్టు స్పష్టం చేసింది. జగిత్యాల జిల్లా కలెక్టర్ యాస్మీన్ భాషతో పాటు స్థానిక ఆర్డీవో, ఎమ్మార్వోలతో సుమారు 120 మంది ఆఫీసర్లు సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ తెరిచారు. ఆ తర్వాత ప్రొసీడింగ్స్ ను హైకోర్టుకు పంపనున్నారు. స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేసే సమయంలో కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హాజరయ్యారు. కొప్పుల తరపున డీసీఎంఎస్ ఛైర్మన్ శ్రీకాంత్ రెడ్డి హాజరయ్యారు.

అంతకు ముందు స్ట్రాంగ్ రూంకు సంబంధించిన తాళం చేతులే లేకపోవడంపై అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. దీని పై ప్రభుత్వం, మంత్రి కొప్పుల ఈశ్వర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు లక్ష్మణ్ కుమార్. రెండు తాళం చేతుల జతలు ఉండాలని, జిల్లా అడిషనల్ కలెక్టర్ కంట్రోల్ లో ఉండాల్సిన తాళం చేతులు మాయం కావడంతో స్ట్రాంగ్ రూం తాళాలను పగలగొట్టారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో












Click it and Unblock the Notifications