పాలన పూర్తి అస్తవ్యస్ధం.!కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఇందుకేనా.?అఖిలపక్ష నేతల అసహనం.!
హైదరాబాద్: జాతీయ రాజకీయాల మీద దృష్టిని కేంద్రీకరించి, సొంత రాష్ట్రంలో పరిపాలన మీద సీఏం చంద్రశేఖర్ రావు పట్టు కోల్పోయారని, అందుకే రాష్ట్రంలో పేపర్ల లీకేజీ అనేది ఒక ట్రెండ్ గా మారిపోయిందని అఖిలపక్ష పార్టీల నాయకులు అభిప్రాయపడ్డారు. బుధవారం టీజేఏస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి, యువజన సంఘాల ఉమ్మడి సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో ప్రస్తుతం రాష్ట్రంలో తీవ్రతరం అవుతున్న నిరుద్యోగ సమస్య, టీఎస్పీఎస్సీ, పేపర్ల లీకేజీ, పదవతరగతి ప్రశ్నాపత్రాల లీకేజీల మీద భవిష్యత్తు కార్యాచరణ గురించి సమగ్రంగా చర్చ జరిగింది. అఖిలపక్ష పార్టీలు, ప్రజా, విద్యార్థి, యువజన సంఘాలు అందరూ ఒకే వేదిక మీదికి వచ్చి ఐక్యంగా పోరాడాలని నిర్ణయించారు.

దీని కోసం "టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ వ్యతిరేక పోరాట కమిటీ" అనే వేదికను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వేదిక ద్వారా త్వరలోనే నిరుద్యోగులకు భరోసా కల్పించడానికి రాష్ట్ర వ్యాప్తంగా అఖిలపక్షాల ఆధ్వర్యంలో పోరాటాన్ని తీవ్రతరం చేయాలని సమావేశంలో అఖిల పక్ష నేతలు నిర్ణయించారు. దీనికి సంబంధించిన పూర్తి రోడ్ మ్యాప్ సిధ్ధం చేయడం జరిగిందని కూడా తెలిపారు.
గురువారం 6వ తారీఖు సాయంత్రం నాలుగు గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగే విలేకరుల సమావేశంలో కమిటీ తరపున అఖిలపక్ష నాయకులు పూర్తి ఉద్యమ కార్యాచరణను ప్రకటించనున్నారు అఖిల పక్ష నేతలు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లు రవి, టీజేఏస్ పార్టీ అధ్యక్షులు ప్రొ. కోదండరాం, తెలంగాణ బీఎస్పీ పార్టీ అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, తెలంగాణ బచావో ఫోరం కన్వీనర్ ఆకునూరి మురళి, సీపీఐ ఎమ్ఎల్ ప్రజాపంథా రాష్ట్ర సెక్రటరి సభ్యురాలు రమాదేవి, సీపీఐ ఎమ్ఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర సెక్రటరి సభ్యులు జేవీ చలపతి రావు, రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర కన్వీనర్ కన్నెగంటి రవి, తెలంగాణ ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ సుధాకర్, పీఓడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు ఝాన్సీ, టీజేఏస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆశప్ప తదితరులు పాల్గొన్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications