CPI, CPM: వామపక్షాల దారెటు..! ఒంటిగానే బరిలోకి దిగుతాయా..!
తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు వామపక్షాల ప్రాబల్యం ఎక్కువగా ఉండేది. కానీ రాను రాను వారి బలం తగ్గుతూ వస్తుంది. ముఖ్యంగా తెలంగాణ వచ్చిన తర్వాత వామపక్షాలు మరింత బలహీన పడ్డాయి. తెలంగాణలో సీపీఎం, సీపీఐ బలం తగ్గుతూ వస్తోంది. ఒకప్పుడు ప్రధాన పార్టీలు సీపీఎం, సీపీఐతో పొత్తులు పెట్టుకోడానికి ముందుకు వచ్చేవి. కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితి కనిపించడంలేదు. ఒంటరిగా పోటి చేస్తే సీటు గెలిచేంతా సత్తా ఆ పార్టీల్లో లేదని మిగతా పార్టీల నేతలు చెబుతున్నారు.
వచ్చే ఎన్నికల్లో సీపీఎం, సీపీఐతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటుందని అందరూ భావించారు. అటు సీపీఎం, సీపీఐ నేతలు బీఆర్ఎస్ పై భారీగా ఆశలు పెట్టుకున్నాయి. కానీ బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ 115 మంది ఇప్పటికే జాబితా ప్రకటించారు. దీంతో వామపక్షాలు దిక్కుతోచని పరిస్థితుల్లోకి వెళ్లినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మునుగోడులో విజయం కోసమే కేసీఆర్ వామపక్షాలతో దోస్తీ చేశాడని.. పొత్తుల కోసం కాదని చెబుతున్నారు.

అయితే వామపక్షాలకు ఇప్పటికీ పలు జిల్లాల్లో ప్రభావం చూపేవింధంగా ఉంది. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో వామపక్షాలు ప్రభావం చూపొచ్చని భావిస్తున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా బరిలో దిగేందుకు ఆ పార్టీలు యోచిస్తున్నాయి. పార్టీ బలంగా ఉన్న చోట పోటీ చేయాలని భావిస్తున్నారు.ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాలో బలంగా ఉన్న చోట బరిలోకి దిగాలని సీపీఎం, సీపీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే సీపీఐ, సీపీఎం ఎక్కడెక్కడ పోటీ చేయాలో చర్చలు జరుగతున్నట్లు తెలుస్తోంది.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐకి బలమున్న ఐదు స్థానాల్లో పోటీ చేస్తామని ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డ్ చెప్పారు. హుస్నాబాద్ లో కూడా పోటీ చేస్తామని ప్రకటించారు. పొత్తుల కోసం ఎవరితోనూ సంప్రదించాల్సిన అవసరం తమకు లేదని చాడ స్పష్టం చేశారు. బీజేపీ పార్టీని ఓడించడమే ప్రధాన లక్ష్యంగా పని చేస్తామని చెప్పారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications