గోమాంసం లేకుంటే సరే, రాజాసింగ్పై క్రమశిక్షణా సంఘం నిర్ణయం: బిజెపి
హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఈ నెల 10వ తేదీన నిర్వహించే బీఫ్ ఫెస్టివల్లో గోమాంసం లేకపోతే తమకు అభ్యంతరం ఉండదని బిజెపి సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ రామచందర్ రావు చెప్పారు. బుధవారం జరిగిన బిజెపి రాష్ట్ర కోర్ కమిటీ సమావేశానంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
తమ పార్టీ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన తమ పార్టీ శాసనసభ్యుడు రాజాసింగ్పై క్రమశిక్షణా సంఘం నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పారు. కిషన్ రెడ్డిపై రాజాసింగ్ బహిరంగ వ్యాఖ్యలు చేయడం సరి కాదని ఆయన అన్నారు.

కిషన్ రెడ్డి తన జీవితాన్ని పార్టీకే అంకితం చేశారని, కిషన్ రెడ్డి నిర్ణయాలేవీ వ్యక్తిగతం కాదని ఆయన అన్నారు. కిషన్ రెడ్డిని అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని రాజాసింగ్ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నిర్వహించే బీఫ్ ఫెస్టివల్ను కిషన్ రెడ్డి వ్యతిరేకించడం లేదని ఆయన తప్పు పట్టారు.
ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేస్తామని రామచందర్ రావు చెప్పారు. స్థానిక ప్రతినిధుల కోటా కింద తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకు ప్రకటన వెలువడిన విషయం తెలిసిందే.
-
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications