హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కూలీ కోసం కూటి కోసం వచ్చి... కమాన్ కూలి ముగ్గురు మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: కూలి కోసం కూటి కోసం హైదరాబాద్ నగరానికి వచ్చి ముగ్గురు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. హైదరాబాదులోని కూకట్‌పల్లి వసంత్‌నగర్‌లో చోటు చేసుకున్న విషాద సంఘటనలో ముగ్గురు మరణించారు. వసంతనగర్‌ పరిధిలోని సీబీసీఐడీ కాలనీ సమీపంలో ఓ గేటెడ్‌ కమ్యూనిటీకి సంబంధించి నిర్మాణంలో ఉన్న కమాన్‌ కూలి ఆ విషాద సంఘటన చోటు చేసుకుంది.

ఈ ఘటనలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కూలీలు నిర్మాణ పనులు చేస్తున్న సమయంలో కమాన్‌ అకస్మాత్తుగా కూలిపోయింది. దీంతో శిథిలాలు మీద పడటంతో ఒడిశాకు చెందిన జనార్థన్‌(50), శ్రీకాకుళం జిల్లాకు చెందిన నాగభూషణ్ (52), ధర్మారావు అక్కడికక్కడే మృతిచెందారు.

Three die as ka man collapses at kukatpally in Hyderabad

తిరుపతిరావు, యాదవ్‌, అంజి, రమణ తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రమాద స్థలాన్ని ఎమ్మెల్యే కృష్ణారావు, జీహెచ్‌ఎంసీ డిప్యూటీ మేయర్‌, సైబరాబాద్‌ వెస్ట్‌జోన్‌ పోలీస్‌ కమిషన్‌ నవీన్‌చంద్‌ పరిశీలించారు.

English summary
Three workers dead as kaman collapses at Kukatpally in Hyderabad. This is second incident in hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X