వర్షంలో తడుస్తుంటే: ఇంట్లోకి పిలిచాడు.. ఊహించని ఘటనతో దిగ్భ్రాంతిలో ఆమె..
వర్షంలో తడుస్తున్న ఆమెను ఇంట్లోకి పిలిచి ఆశ్రయం ఇచ్చి రేప్ చేశాడు.
హైదరాబాద్: వికారాబాద్ జిల్లాకు చెందిన ఓ గిరిజన మహిళ(48)పై రాజేంద్రనగర్ ఉప్పర్పల్లికి చెందిన మరో గిరిజన యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. శనివారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకోగా.. బాధితురాలి ఫిర్యాదుతో విషయం వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే.. వికారాబాద్ జిల్లాకు చెందిన ఓ గిరిజన మహిళ రాజేంద్రనగర్ ఉప్పర్పల్లిలో నివాసముండే తన కుమారుల వద్దకు వచ్చింది. శనివారం సాయంత్రం ఏదో పని నిమిత్తం తెలిసినవారి ఇంటికి వెళ్లింది. అక్కడి నుంచి తిరిగి ఇంటికి బయలుదేరిన సమయంలో.. మార్గమధ్యలో జోరు వాన మొదలైంది. దీంతో దారిలో ఉన్న ఓ ఇంటి ముందు నిలబడింది.

వర్షం మరింత జోరందుకోవడంతో ఆమె తడవడం మొదలైంది. ఇది గమనించిన ఆ ఇంటి వ్యక్తి రాజునాయక్(23)ఆమెను ఇంట్లోకి పిలిచాడు. తాను కూడా గిరిజనుడినే అని పరిచయం చేసుకుని అదే భాషలో మాట్లాడాడు. దీంతో అతని మాటలు నమ్మి ఆమె ఇంట్లోకి వెళ్లింది.
కాసేపటికే.. ఇంటి తలుపులు మూసేసి, విద్యుత్ సరఫరా నిలిపివేసి ఆ గిరిజన మహిళపై రాజు నాయక్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఊహించని ఘటనతో బాధితురాలు దిగ్భ్రాంతికి గురైంది. బాధితురాలు శనివారం రాత్రి రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
-
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!











Click it and Unblock the Notifications