సహనం కోల్పోయిన టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే: బూటు కాలితో తన్నుతూ..!
హుస్నాబాద్: టీఆర్ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ ఎన్నికల ప్రచారంలో సహనం కోల్పోయి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై దాడి చేశారు. తనను నిలదీసిన కాంగ్రెస్ కార్యకర్తలపై బూటు కాలితో తన్నినట్లు తెలిసింది.

వొడితలకు నిరసన సెగ
వివరాల్లోకి వెళితే.. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గోవర్ధనగిరి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు టీఆర్ఎస్ నాయకుడు వొడితల సతీష్ కుమార్ వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలతోపాటు కొందరు స్థానికులు నిరసన తెలియజేసేందుకు రోడ్డుపై బైఠాయించారు.

వ్యతిరేక నినాదాలు
నాలుగేళ్ల టీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి ఎక్కడ జరిగిందని, తమ గ్రామాన్ని అనవసరంగా అక్కన్నపేట మండలంలో కలిపారని వొడితలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

సహనం కోల్పోయిన వొడితల.. బూటు కాలితో..
ఈ ధర్నాలో స్థానిక కాంగ్రెస్ నేతలు కూడా టీఆర్ఎస్కు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ఒక్కసారిగా సహనం కోల్పోయిన వొడితల సతీష్.. వారిపై దూసుకెళ్లారు. వారిని బూటు కాలితో తన్నుకుంటూ వెళ్లడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

ఉద్రిక్తత.. పోలీసుల రంగప్రవేశం
వొడితలతోపాటు అనుచరులు, టీఆర్ఎస్ నాయకులు కూడా నినాదాలు చేస్తున్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలపై దాడికి దిగారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
-
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
ఈ కొమ్మల మధ్య ఉన్న పచ్చని పామును చూశారా ? -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !! -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!!












Click it and Unblock the Notifications