కేసీఆర్కు జగన్ ఝలక్, వైసిపిలోకి ఖమ్మం తెరాస, కాంగ్రెస్ నేతలు
ఖమ్మం: ఖమ్మం జిల్లాకు చెందిన తెరాస, కాంగ్రెస్ నాయకులు గురువారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైసిపి అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వారు హైదరాబాదులో ఆ పార్టీలో చేరారు.
తెరాస ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి లక్కినేని సుధీర్ తదితరులకు జగన్ పార్టీ కండువా కప్పి వైసిపిలోకి ఆహ్వానించారు. వైసిపి తెలంగాణ అధ్యక్షులు గట్టు శ్రీకాంత్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కొండా రాఘవ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
లక్కినేని సుధీర్తో పాటు ఖమ్మం జిల్లాకు చెందిన అమర్లపూడి బాలశౌరి, వంగూరు మల్లేష్ గౌడ్, గరినె సతీష్, కాంగ్రెస్ నేతలు గాదె వీరా రెడ్డి తదితరులు ఈ పార్టీలో చేరారు. కాగా, ఖమ్మం జిల్లాకు చెందిన తెరాస నేతలు వైసిపిలో చేరడం గమనార్హం.
Comments
English summary
TRS leaders join YSR Congress in the presence of YS Jagan.