రాష్ట్రానికి సహకరిస్తే రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏకు సహకరిస్తాం: టిఆర్ఎస్
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇస్తామని టిఆర్ఎస్ పార్టీ ప్రకటించింది.
హైదరాబాద్: రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇస్తామని టిఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. తెలంగాణకు సహాయం చేస్తే రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్ డి ఏ అభ్యర్థికి తమ పార్టీ మద్దతిస్తోందని లోక్ సభలో టిఆర్ఎస్ నాయకుడు ఏపీ జితేందర్ రెడ్డి చెప్పారు.
తెలంగాణకు ఎప్పుడు మేలు చేసినా మేం ఎన్ డి ఏ వెంట ఉంటామన్నారు. మా రాష్ట్రానికి వ్యతిరేకంగా వ్యవహారిస్తే ఎన్ డి ఏ తో ఉండబోమని చెప్పారు. ఈ విషయంలో సరైన సమయంలో తమ పార్టీ నిర్ణయం తీసుకొంటుందని చెప్పారు.
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీకాలం జూలై 24తో ముగియనుంది. ఈలోపు రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది.ఈలోపు రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. మరో వైపు విపక్షాల తరపున ఉమ్మడి అభ్యర్థిని నిలిపేందుకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే టిఆరఎస్ ఎవరికి మద్దతు ఇవ్వాలనే దానిపై తమ పార్టీ అధ్యక్షుడు కెసిఆర్ నిర్ణయం తీసుకొంటారని నిజామాబాద్ ఎంపి కవిత చెప్పారు.
జాతీయ పార్టీలు అభ్యర్థులను ప్రకటించిన తర్వాత ఎవరికి మద్దతు ఇవ్వాలనేది పార్టీ నిర్ణయిస్తోంది. మా పార్టీ అధ్యక్షుడు కెసిఆర్ తగిన నిర్ణయం తీసుకొంటారని ఆమె చెప్పారు.