షాక్: విమానం ఎక్కించుకొనేది లేదన్న ట్రూజెట్, వెనుదిరిగిన జెసి దివాకర్రెడ్డి
అనంతపురం పార్లమెంట్ సభ్యుడు జెసి దివాకర్రెడ్డిని తమ విమానంలో ప్రయాణించేందుకు ట్రూజెట్ ఎయిర్లైన్స్ నిరాకరించింది. మీపై నిషేధం ఉన్న కారణంగా అనుమతించబోమంటూ ఆ విమానాయాన సిబ్బంది జెసికి స్పష్టం చేశారు.
హైదరాబాద్: అనంతపురం పార్లమెంట్ సభ్యుడు జెసి దివాకర్రెడ్డిని తమ విమానంలో ప్రయాణించేందుకు ట్రూజెట్ ఎయిర్లైన్స్ నిరాకరించింది. మీపై నిషేధం ఉన్న కారణంగా అనుమతించబోమంటూ ఆ విమానాయాన సిబ్బంది జెసికి స్పష్టం చేశారు.
శంషాబాద్ విమానాశ్రయం నుండి విజయవాడకు వెళ్ళేందుకు జెసిదివాకర్రెడ్డి శంషాబాద్ ఎయిర్పోర్ట్కు ఆదివారం నాడు ఉదయం వచ్చారు. అయితే ఆయన ట్రూజెట్ విమానంలో విజయవాడ వెళ్ళాల్సి ఉంది. ఈ మేరకు ఆయన టిక్కెట్టు కూడ బుక్ చేసుకొన్నాడు.

మీపై నిషేధం ఉన్న కారణంగా అనుమతించలేమంటూ ట్రూజెట్ సిబ్బంది ఆయనను ట్రూజెట్ విమానంలో ప్రయాణీంచేందుకు నిరాకరించారు.దీంతో ఆయన చేసేదేమీలేక వెనుదిరిగారు.
ఇటీవల విశాఖపట్టణంలో ఆయన విమానాశ్రయసిబ్బందిపై అనుచితంగా ప్రవర్తించారు. ఈ ఘటనతో పలు విమానాయానసంస్థలు ఆయనపై నిషేధాన్ని విధించాయి.












Click it and Unblock the Notifications