ఎన్నారై ఫిర్యాదు: సినీతారల్ని మోసం చేసిన కోహ్లీ అరెస్ట్, భానుకు లింక్
హైదరాబాద్: యూరేనియం కేసులో కీలక నిందితుడు కోహ్లీతో పాటు ఐదుగురు నిందితులను తెలంగాణ సీఐడీ అధికారులు బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. యూరేనియం కేసుతో భాను కిరణ్కు కూడా సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారని తెలుస్తోంది.
భాను కిరణ్.. మద్దెలచెరువు సూరి హత్య కేసులో కీలక నిందితుడు. అతనికి కూడా యూరేనియం కేసులో లింక్ ఉన్నదని తెలుస్తోంది. గంగాధర్, శ్రీనివాస్ తదితరులతో కలిసి భాను కిరణ్ వసూళ్లకు పాల్పడ్డారని తెలుస్తోంది.
యూరేనియం కేసులో కోహ్లీ కీలక నిందితుడు. వీరు 16 రాష్ట్రాల్లో పలువురు వీఐపీలను మోసం చేసినట్లుగా గుర్తించారు. రూ.300 కోట్లకు పైగా వసూలు చేసినట్లు తెలుస్తోంది. కోహ్లీ ఉచ్చులో విఐపీలు, సినిమా తారలు ఎక్కువగా ఉన్నారని తెలుస్తోంది.
వీరి చేతిలో మోసపోయిన ఓ ఎన్నారై తెలంగాణ సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదుతో డొంక కదిలింది. స్పందించిన సీఐడీ వారిని అదుపులోకి తీసుకుంది. ఏపీ, కర్నాటక, తెలంగాణలలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ యూరేనియం కేసు గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.