హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నాడు మన్మోహన్ సింగ్‌ను కలిశాం, పనికాలేదు, ఇప్పుడు మోడీని.: కేటీఆర్ ఫొటో ట్వీట్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: గత యూపీఏ, ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వాల తీరుపై తెలంగాణ మంత్రి కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓబీసీకి కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కేటీఆర్ కోరారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యలు చేశారు.

ఇదే విషయంపై కేసీఆర్ ఆధ్వర్యంలో 2004 నుంచి ప్రయత్నిస్తున్నామని కేటీఆర్ తెలిపారు. గతంలో కేసీఆర్ నేతృత్వంలో ఆర్ కృష్ణయ్య సహా ఓబీసీ సంఘాలు ఢిల్లీ వెళ్లి అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్‌ను కలిసి విజ్ఞప్తి చేశాయని కేటీఆర్ గుర్తు చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోను కూడా ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.

 TS minister KTR demands PM Modi to setup special ministry for OBC

అయితే నాటి యూపీఏ ప్రభుత్వం ప్రత్యేక మంత్రిత్వశాఖ అంశాన్ని పరిగణలోకి తీసుకోలేదని కేటీఆర్ తెలిపారు. ఓబీసీ మంత్రిత్వ శాఖ కోసం ప్రధాని మోడీని కూడా తాము కోరామన్నారు మంత్రి కేటీఆర్.

ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పటికైనా ఓబీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి, 2023 బడ్జెట్‌లోనైనా నిధులు కేటాయిస్తారని ఆశిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

English summary
TS minister KTR demands PM Modi to setup special ministry for OBC.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X