TSPSC సంచలనం: తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమ్స్ సహా ఈ పరీక్షలు రద్దు
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేసింది.
హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేసింది. దీంతోపాటు ఏఈఈ, డీఏవో పరీక్షలను కూడా రద్దు చేస్తున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. రద్దు చేసిన గ్రూప్-1 ఈ ఏడాది జూన్ 11న నిర్వహించనున్నట్లు పేర్కొంది.
ఇటీవల అసిస్టెంట్ ఇంజినీర్(ఏఈ) పేపర్ లీకేజీ కారణంగా ప్రత్యేక దర్యాప్తు బృందం(SIT) నివేదిక ఆధారంగా ఆ పరీక్షలను రద్దు చేసినట్లు టీఎస్ పీఎస్సీ స్పష్టం చేసింది. గత అక్టోబర్ 16న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు. ఈ ఏడాది జనవరి 22న ఏఈఈ, ఫిబ్రవరి 26న డీఏవో పరీక్షలను నిర్వహించారు.

అయితే, ఇప్పటికే టౌన్ ప్లానింగ్, ఎంవీఐ పరీక్షలు రద్దు చేసిన టీఎస్ పీఎస్సీ.. ఇప్పుడు గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేయడం సంచలనంగా మారింది. మరోవైపు, త్వరలో నిర్వహించనున్న మరిన్ని పరీక్షలను కూడా వాయిదా వేయాలనే యోచనలో టీఎస్ పీఎస్సీ ఉన్నట్లు తెలుస్తోంది.

కాగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి గత సంవత్సరం 503 గ్రూప్-1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 19 విభాగాలకు చెందిన 503 పోస్టులకు గానూ గత అక్టోబర్ 16న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించారు. 3,80,202 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 3.42 లక్షల మంది హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 1019 కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షను 2.86 లక్షల మంది రాశారు. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రాసినవారిలో 25,050 మంది మెయిన్స్ కు అర్హత సాధించారు. ఈ ఏడాది జూన్ 5 నుంచి 12 వరకు గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష తేదీలను కూడా ఖరారు చేసింది టీఎస్పీఎస్సీ. అయితే, తాజాగా, గ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దు చేయడంతో అర్హత సాధించిన అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications