పోకిరీకి టీవీ చానళ్లో పని చేస్తున్న యువతి చెప్పు దెబ్బలు
హైదరాబాద్: మద్యం మత్తులో అనుచితంగా ప్రవర్తించిన పోకిరీకి చెప్పుదెబ్బలతో బుద్ధి చెప్పిన ఓ యువతి స్థానికుల సహకారంతో పోలీసులకు అప్పగించిన సంఘటన గురువారంనాడు హైదరాబాదులో జరిగింది. కూకట్పల్లికి చెందిన అజారుద్దీన్ వెల్డర్గా పని చేస్తున్నాడు.
బంజారాహిల్స్లోని ఓ న్యూస్ ఛానల్లో పని చేస్తున్న ఓ యువతి గురువారం మరో సహ ఉద్యోగితో కలిసి తన వాహనం పైన హైటెక్ సిటీ నుంచి కూకట్ పల్లి మీదుగా బాలానగర్ వెళ్తున్నారు. కేపీహెచ్బీ కాలనీ సమీపంలో అజారుద్దీన్ వారు ప్రయాణిస్తున్న వాహనాన్ని బైక్ పైన అనుసరించాడు.
ఆమెను అసభ్యకరమైన వ్యాఖ్యలతో వేధించాడు. ఇబ్బంతి సృష్టించాడు. దీంతో సదరు యువతి షీ బృందానికి సమాచారం ఇచ్చింది. ఆమె అతనిని చెప్పుతో కొట్టింది.
స్థానికుల సహకారంతో పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఛానల్లో ఉద్యోగినిగా పని చేస్తున్న ఆ యువతి పేరు జ్యోత్స్న. అజారుద్దీన్ ఆమె పట్ల అసభ్య వ్యాఖ్యలతో పాటు గిల్లే ప్రయత్నం కూడా చేశాడు.